NIA: కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA court convicts 8 suspected IS operatives: కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.
2017లో కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది దోషులు ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును మొదటగా లక్నోలని ఏటీఎస్ పోలీస్ స్టేషన్ నమోదు చేయగా.. ఆ తరువాత ఎన్ఐఏకు అప్పగించారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తూ.. ఐఈడీలు తయారు చేసి పరీక్షించారని, ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వీటిని అమర్చి పేల్చడానికి యత్నించినట్లు ఎన్ఐఏ కోర్టులో తెలిపింది. లక్నోలోని దోషుల రహస్య ప్రదేశం నుంచి నోట్ బుక్ స్వాధీనం చేసుకున్నారు అధికారు. వీటిలో బాంబుల తయారీకి సంబంధించి వివారాలు ఉన్నట్లు ఏన్ఐఏ పేర్కొంది.
Also Read
- Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
Read Also: Pakistan Economic Crisis: ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..
నిందితులు ఐఈడీలను తయారుచేస్తున్నారని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఎస్ఐఎస్ జెండాతో పాటు పలు ఫోటోలను కూడా కనుగొన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా సేకరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. మార్చి 7, 2017లో భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో జరిగిన పేలుడులో ఈ 8 మంది దోషులు కూడా పాల్గొన్నారు. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కాన్పూర్ నగర్ కు చెందిన మహ్మద్ ఫైసల్ ను రైలు పేలుడులో పాల్గొనందుకు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో పురోగతి వచ్చింది. అతడు వెల్లడించిన వివరాలతో అతని సహచరులు గౌస్ మహ్మద్ అలియాస్ కరణ్ ఖత్రి, అజర్ ఖాన్ అలియాస్ అజర్ ఖలీఫా, ఆసిఫ్ ఇక్బాల్ అలియాస్ రాకీలను అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే. భారత్ లో ఐసిస్ భావజాలాన్ని వ్యాపించేందుకు దోషులు ప్రయత్నించారు. ఇస్లామిక్ స్టేట్ దాని నాయకుడి అబూబకర్ అల్ బాగ్దాదీకి విధేయత ప్రకటించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
-
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!