Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్పై వెలుగులోకి సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!
- ఢిల్లీ బ్లాస్ట్పై వెలుగులోకి సంచలన విషయాలు!
- దర్యాప్తులో కీలక సమాచారం సేకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు యావత్తు భారతదేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి తేరుకుంటున్న సమయంలో మరోసారి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇదిలా ఉంటే ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కారులో ఐఈడీ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్లో బాంబ్ తయారీలో ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోబోతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట సమీపంలో అనుమానితులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలో పొరపాటుగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
కారులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED)ను అనుమానితుడు సరైన రీతిలో అమర్చకపోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా నిపుణులు అంచనాకు వచ్చారు. అయితే పేలుడు ధాటికి సమీపంలో ఉన్నవారికి తీవ్ర నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది చనిపోగా.. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.
ఇక కారు నడిపిన కీలక నిందితుడు జమ్మూకాశ్మీర్కు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. సోమవారం పేలుడు సంభవించడానికి ముూడు రోజుల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కమ్యూనికేషన్లు జరిగించలేదు. ఈ మేరకు దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!