Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్పై వెలుగులోకి సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!
- ఢిల్లీ బ్లాస్ట్పై వెలుగులోకి సంచలన విషయాలు!
- దర్యాప్తులో కీలక సమాచారం సేకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు యావత్తు భారతదేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి తేరుకుంటున్న సమయంలో మరోసారి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
ఇదిలా ఉంటే ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కారులో ఐఈడీ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్లో బాంబ్ తయారీలో ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోబోతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట సమీపంలో అనుమానితులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలో పొరపాటుగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
కారులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED)ను అనుమానితుడు సరైన రీతిలో అమర్చకపోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా నిపుణులు అంచనాకు వచ్చారు. అయితే పేలుడు ధాటికి సమీపంలో ఉన్నవారికి తీవ్ర నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది చనిపోగా.. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.
ఇక కారు నడిపిన కీలక నిందితుడు జమ్మూకాశ్మీర్కు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. సోమవారం పేలుడు సంభవించడానికి ముూడు రోజుల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కమ్యూనికేషన్లు జరిగించలేదు. ఈ మేరకు దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!