Kerala doctor Suicide: BMW కారు, బంగారం కట్నంగా ఇవ్వలేదని ఆగిన పెళ్లి.. పెళ్లికూతురు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala doctor Suicide: వరకట్న వివాదం ఓ మహిళా వైద్యురాలి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. షహానా అనే యువతి తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిగా ఉంది. వరకట్నం ఇవ్వలేదని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అద్దె అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. యువతి కుటుంబం వరకట్నం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని, ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపించారు.
Read Also: Revanth reddy Speech: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
పెళ్లి చేసుకోవాలంటే బంగారం, భూమి, BMW కారుని కట్నంగా ఇవ్వాలని షహానా బాయ్ఫ్రెండ్ కుటుంబం డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్నాడు. కట్నం వివాదంలో వీరిద్దరి మధ్య రిలేషన్ ముగిసింది. మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్న షహానా తండ్రి ఇటీవల మరణించారు.
వరకట్నం డిమాండ్ చేస్తున్న కుటుంబంతో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవడం షహానా అన్న జాసిమ్ నాస్కి ఇష్టం లేదు. షహానా ఆనందం కోసమే అతను పెళ్లికి ఒప్పుకున్నారు. షహానా ప్రియుడు డాక్టర్ రువైస్ కట్నం కింద ఏకంగా 150 తులాల బంగారం, బీఎండబ్ల్యూ కార్, 15 ఎకరాల భూమిని కట్నంగా కోరాడు. అయితే షహాన కుటుంబం ఆ డిమాండ్లను నెరవేర్చలేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. రువైస్, షహానా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే కట్నం విషయంలో మాత్రం అతడు యువతికి అండగా నిలబడలేదు. దీంతో పెళ్లి క్యాన్సల్ అయింది. ఆమె మత్తుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక అందించాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖను ఆదేశించింది. కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ సతీదేవీ బుదవారం షహానా తల్లిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత వైద్యురాలి నుంచి వైద్యుడి కుటుంబం వరకట్నం డిమాండ్ చేసినట్లు తేలితే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తామని సతీదేవీ తెలిపారు. మరోవైపు రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్, సదరు వ్యక్తిని అన్ని బాధ్యతల నుంచి తప్పించింది.
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!