Kerala: గవర్నర్, సీఎంల మధ్య ముదిరిన వివాదం.. తగ్గేదే లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala CM Pinarayi Rejects Governor Arif Demands: కేరళ గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్ర యూనివర్సిటీలకు వీసీల నియామకం విషయంలో.. గవర్నర్ ఆరిఫ్ మమ్మద్ ఖాన్, పినరయి మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేవని ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ తొలుత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారానికి కల్లా తనకు రాజీనామాలు సమర్పించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆ నోటీసులకు వీసీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపాద్రిక్తుడైన గవర్నర్.. షోకాజ్ నోటీసులు పంపించారు. ఆ హోదాల్లో వీసీలకున్న చట్టబద్ధమైన హక్కును ఆ నోటీసుల్లో ప్రశ్నించడంతో పాటు.. నవంబరు 3వ తేదీలోపు బదులు ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం పినరయి అప్పుడు తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని కుండబద్దలు కొట్టారు.
తాజాగా ఈ వ్యవహారంలో ఆర్థికమంత్రి కే. బాలగోపాల్ జోక్యం చేసుకోవడంతో.. ఆ వివాదం మరింత ముదిరింది. అక్టోబర్ 18వ తేదీన యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన వారు (గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ని ఉద్దేశిస్తూ) కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న గవర్నర్.. సీఎంకు లేఖ రాశారు. బాలగోపాల్ వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. బాలగోపాల్ తన విశ్వాసం కోల్పోయారని, రాజ్యాంగబద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎంకి సూచించారు. ఇందుకు సీఎం పినరయి బదులిస్తూ.. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే.. తనకు ఆర్థికమంత్రిపై ‘అచంచలమైన విశ్వాసం’ ఉందని కౌంటర్ ఇచ్చారు.
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..