Kerala: గవర్నర్, సీఎంల మధ్య ముదిరిన వివాదం.. తగ్గేదే లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala CM Pinarayi Rejects Governor Arif Demands: కేరళ గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్ర యూనివర్సిటీలకు వీసీల నియామకం విషయంలో.. గవర్నర్ ఆరిఫ్ మమ్మద్ ఖాన్, పినరయి మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేవని ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ తొలుత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారానికి కల్లా తనకు రాజీనామాలు సమర్పించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆ నోటీసులకు వీసీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపాద్రిక్తుడైన గవర్నర్.. షోకాజ్ నోటీసులు పంపించారు. ఆ హోదాల్లో వీసీలకున్న చట్టబద్ధమైన హక్కును ఆ నోటీసుల్లో ప్రశ్నించడంతో పాటు.. నవంబరు 3వ తేదీలోపు బదులు ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం పినరయి అప్పుడు తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని కుండబద్దలు కొట్టారు.
తాజాగా ఈ వ్యవహారంలో ఆర్థికమంత్రి కే. బాలగోపాల్ జోక్యం చేసుకోవడంతో.. ఆ వివాదం మరింత ముదిరింది. అక్టోబర్ 18వ తేదీన యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన వారు (గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ని ఉద్దేశిస్తూ) కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న గవర్నర్.. సీఎంకు లేఖ రాశారు. బాలగోపాల్ వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. బాలగోపాల్ తన విశ్వాసం కోల్పోయారని, రాజ్యాంగబద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎంకి సూచించారు. ఇందుకు సీఎం పినరయి బదులిస్తూ.. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే.. తనకు ఆర్థికమంత్రిపై ‘అచంచలమైన విశ్వాసం’ ఉందని కౌంటర్ ఇచ్చారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!