Delhi Election Results: ఆప్లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?
- ఆప్లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు
- కేజ్రీవాల్, సిసోడియాను దెబ్బకొట్టిన లిక్కర్ స్కామ్
- ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్, సిసోడియా ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది. ఇంకేముందు తాజా ఫలితాల్లో నేలకొరిగేలా చేసింది. ఓటర్లు కొట్టిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Anshu: 15 ఏళ్లకే మన్మధుడు.. అందుకే ఇండస్ట్రీ వదిలేశా.. ఇప్పుడు ఎంట్రీ ఎందుకంటే?
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పొందారు. నూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్, తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా ఓడిపోయారు. ఆప్ అధినేతను 4,000 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ ఓడించారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.
కొంపముంచిన లిక్కర్ స్కామ్..
కేజ్రీవాల్, సిసోడియా ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ స్కామే అని చెప్పక తప్పదు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్.. ముగ్గురు జైలుకెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరిస్థితి మసకబారింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక.. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి.. ఆ పీఠంపై నమ్మకస్థురాలైన అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ప్రజలు అధికారం ఇస్తేనే ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం పూనారు. తాజా ఫలితాలు చూశాక..కేజ్రీవాల్ను విశ్వసించలేదని అర్థమైంది.
ఇది కూడా చదవండి: Rajamouli: గతానికి భిన్నం.. వేట మొదలెట్టిన జక్కన్న!
అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా.. ఇలా బీజేపీ అగ్ర నేతలంతా కేజ్రీవాల్ ‘‘శేష్ మహాల్’’ అంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర స్కామ్ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వీడియోలు, ఫొటోలు వైరల్ చేశారు. ఇవి వేగంగా ప్రజల్లో చొచ్చుకెళ్లాయి. ఇవే కేజ్రీవాల్ను కొంపముంచాయని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆప్ అభ్యర్థులను ప్రకటించడం.. ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. అన్ని వర్గాలకు ఉచిత హామీలు కూడా ఇచ్చేశారు. అయినా కూడా ప్రజలు ఆప్ను విశ్వసించలేదు.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!