Delhi Election Results: ఆప్లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?
- ఆప్లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు
- కేజ్రీవాల్, సిసోడియాను దెబ్బకొట్టిన లిక్కర్ స్కామ్
- ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్, సిసోడియా ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది. ఇంకేముందు తాజా ఫలితాల్లో నేలకొరిగేలా చేసింది. ఓటర్లు కొట్టిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Anshu: 15 ఏళ్లకే మన్మధుడు.. అందుకే ఇండస్ట్రీ వదిలేశా.. ఇప్పుడు ఎంట్రీ ఎందుకంటే?
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పొందారు. నూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్, తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా ఓడిపోయారు. ఆప్ అధినేతను 4,000 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ ఓడించారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.
కొంపముంచిన లిక్కర్ స్కామ్..
కేజ్రీవాల్, సిసోడియా ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ స్కామే అని చెప్పక తప్పదు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్.. ముగ్గురు జైలుకెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరిస్థితి మసకబారింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక.. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి.. ఆ పీఠంపై నమ్మకస్థురాలైన అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ప్రజలు అధికారం ఇస్తేనే ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం పూనారు. తాజా ఫలితాలు చూశాక..కేజ్రీవాల్ను విశ్వసించలేదని అర్థమైంది.
ఇది కూడా చదవండి: Rajamouli: గతానికి భిన్నం.. వేట మొదలెట్టిన జక్కన్న!
అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా.. ఇలా బీజేపీ అగ్ర నేతలంతా కేజ్రీవాల్ ‘‘శేష్ మహాల్’’ అంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర స్కామ్ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వీడియోలు, ఫొటోలు వైరల్ చేశారు. ఇవి వేగంగా ప్రజల్లో చొచ్చుకెళ్లాయి. ఇవే కేజ్రీవాల్ను కొంపముంచాయని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆప్ అభ్యర్థులను ప్రకటించడం.. ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. అన్ని వర్గాలకు ఉచిత హామీలు కూడా ఇచ్చేశారు. అయినా కూడా ప్రజలు ఆప్ను విశ్వసించలేదు.
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!