IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్తో రూ. కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 2021 నుంచి ఐపీఎల్ బెట్టింగ్లు వేస్తున్నాడు. దీని కోసం అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉంటే ఇలా అప్పులు ఎక్కువ కావడంతో రుణదాతల నుంచి నిత్యం వేధింపులు ఎదుర్కొంటోన్నాడు.
Read Also: IPL 2024: ఆర్సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
వేధింపులతో విసిగిపోయిన దర్శన్ బాబు భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 23 ఏళ్ల రంజిత కర్ణాటక చిత్రదుర్గలో తన ఇంట్లో మార్చి 18న ఉరేసుకుని కనిపించింది. భర్త దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశాడు. 2021-2023 మధ్య ఐపీఎల్ బెట్టింగ్లో ఇరుక్కున్నాడు. దీంతో దంపతుల సంసారంలో అప్పులు మనస్పర్థలకు దారితీశాయి. దాదాపుగా రూ. 1.5 కోట్లకు పైగా రుణం తీసుకున్నాడని తెలిసింది. రూ. 1 కోటి అప్పు తీర్చగా.. మరో రూ. 84 లక్షల రుణం పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్శన్, రంజితలు 2020లో వివాహం చేసుకున్నారు. దర్శన్ బెట్టింగ్లో పాల్గొంటున్న నిజాన్ని 2021లో రంజిత తెలుసుకున్నట్లు ఆమె తండ్రి వెంకటేష్ తెలిపాడు. వడ్డీ వ్యాపారుల నుంచి నిత్యం వేధింపుల వల్ల తన కుతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పు ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశను చూపి తన అల్లుడిని ట్రాప్ చేసినట్లు ఆయన పేర్నొన్నాడు. పోలీసులు తమ విచారణలో సూసైడ్ నోట్ని కనుగొన్నారు. దర్శన్, రంజితలకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!