కర్ణాటకలో లాక్డౌన్ మళ్లీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరోసారి పొడిగించింది కర్ణాటక ప్రభుత్వం.. ప్రస్తుత లాక్డౌన్ గడువు ఈనెల 24తో ముగియనుండగా.. జూన్ 7వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్డౌన్ పొడిగించినట్టు వెల్లడించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత లాక్డౌన్పై ప్రకటన చేశారు.. ఈ సమయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ప్రజలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తామని తెలిపారు.. లాక్డౌన్ రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, బ్లాక్ ఫంగస్కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!
-
Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్మీట్.. విజయ్కు మద్దతుపై ఉత్కంఠ
-
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!