Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
- పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం..
- గో-అరౌండ్ ప్రక్రియ సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే ముందు విమానం ‘‘గో-అరౌండ్’’ ప్రక్రియలో భాగంగా అటారీ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI479 రెండు నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్లు ఒకరినొకరు తమ గగనతలాన్ని మూసివేస్తున్నన్న విషయం తెలిసిందే.
ఎయిర్బస్ A321 విమానం ఢిల్లీ నుంచి రాత్రి 9:18 గంటలకు బయలుదేరి, అమృత్సర్లో రాత్రి 10:30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అమృత్సర్ విమానాశ్రయంలో అధికా ఎయిర్ ట్రాఫిక్, ఆపరేషనల్ కారణాల వల్ల ల్యాండింగ్ అనుమతి రాలేదు. ఆ తర్వాత అమృత్సర్ విమానాశ్రయంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ఆ విమానాన్ని ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీని తర్వాత ఢిల్లీ చేరుకున్న విమానానికి సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మళ్లీ అదే విమానాన్ని అమృత్సర్ పంపించారు. చివరకు మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటలకు అక్కడ ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు దాదాపుగా 4 గంటల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.
Also Read
- Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
- Citizenship: పాస్పోర్టు ఉంటే పౌరసత్వం ఉన్నట్లు కాదు: కేంద్రం..
- Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
విమానం తమ గగనతలంలోకి వచ్చిననట్లు గమనించిన పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ విషాయాన్ని వెల్లడించి అప్రమత్తం చేసింది. దీంతో వెంటనే విమానం తిరిగి భారత్ ఎయిర్ స్పేస్లోకి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘జూన్ 22న ఢిల్లీ-అమృత్సర్ AI479 విమానం గో-అరౌండ్ ప్రక్రియలో భాగంగా కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలాన్ని ఉల్లంఘించింది. ఈ విషయాన్ని సంబంధిత నియంత్రణ సంస్థలకు తెలియజేశాం. ప్రస్తుతం అంతర్గత విచారణ కొనసాగుతోంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా అత్యున్నత ప్రాధాన్యత’’ అని పేర్కొంది.
తాజావార్తలు
-
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. డ్రెస్సింగ్ రూమ్లోకి నో ఎంట్రీ..
-
Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
-
KTR : రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం
-
Pakistan-Israel: అసిమ్ మునీర్ హత్యా ఆరోపణలపై స్పందించిన పాకిస్థాన్
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!