CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
- 16 టీఎంసీల వాటా.. అందుతున్నది 5 టీఎంసీలే
- పూడిక తొలగింపుతో నీటి ప్రవాహం పెంపు
- తుమ్మిళ్ల పథకంతో సాగునీటి భద్రత
- రైతులకు పూర్తి వాటా అందించడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన బహుముఖ కార్యాచరణను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన, నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆర్డీఎస్ పరిస్థితి, తుంగభద్ర బోర్డు కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించారు. దశాబ్దాల నాటి ఆర్డీఎస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ, తెలంగాణకు కేటాయించిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఇంజినీరింగ్, పరిపాలనా, అంతర్రాష్ట్ర సమన్వయ చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
16 టీఎంసీల వాటా.. లభిస్తున్నది తక్కువే
ఆర్డీఎస్ కింద తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి దాదాపు 16 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే రాష్ట్రం వినియోగించుకోగలుగుతోంది. కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా పూడిక (సిల్ట్) పేరుకుపోవడం, నది ప్రవాహ మార్గంలో వచ్చిన మార్పులు, నిర్మాణాత్మక అవరోధాలు కాలువలోకి నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతేకాకుండా, సాంకేతిక అంచనాల ప్రకారం కొన్ని పరిస్థితుల్లో నది ప్రవాహంలో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లిపోవడం వల్ల తెలంగాణ కాలువ హెడ్ వద్ద నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోందని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తక్షణ చర్యగా శాస్త్రీయ పూడిక తొలగింపు
కీలకమైన సాగు కాలాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యగా డ్రెడ్జింగ్ (పూడిక తొలగింపు) చేపట్టడం అత్యంత ఆచరణ సాధ్యమైన పరిష్కారమని ఇంజినీర్లు వివరించారు. కాలువ హెడ్ వద్ద పేరుకుపోయిన సిల్ట్ను శాస్త్రీయంగా తొలగించడం ద్వారా ప్రవాహాన్ని వేగవంతం చేయవచ్చని నిర్ణయించారు. ఈ తక్షణ చర్యలతో పాటు కాలువ ప్రవేశద్వారం వద్ద సిల్ట్ మట్టిని పూర్తిగా తొలగించి, సరైన గ్రేడియెంట్లను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ సిల్టింగ్ జరగకుండా నివారించేందుకు నిపుణుల కమిటీ సూచించిన విధంగా రిటైనింగ్ వాల్ , నది ప్రవాహాన్ని స్థిరీకరించేందుకు రివెట్మెంట్ పనుల నిర్మాణం అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం.. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు
ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యామ్నాయ వనరుగా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిని కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో మూడు పంప్ హౌస్ల నిర్మాణం, రెండో దశలో మల్లమ్మకుంటతో సహా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా నీటి లభ్యతను పెంచి సాగునీటి స్థిరత్వాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచే అవకాశాలను పరిశీలించాలని, అవసరమైతే ఇందుకోసం అదనపు భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంతర్రాష్ట్ర సమన్వయం.. సమగ్ర కార్యాచరణ
రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాలను తీర్చగల శాశ్వత పరిష్కారాల కోసం 2004లో నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులను కూడా ఈ సందర్భంగా పునఃసమీక్షించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ, తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు , కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. డ్రెడ్జింగ్, కాలువ హెడ్ అభివృద్ధి పనులు, ఆధునీకరణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పొలాలకు నీరు చేరడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండటం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, కేటాయించిన ప్రతి బొట్టు నీరు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలకు చేరేలా చూడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!