Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Crime News Telangana Family Disputes Lead To Suicide Murders Shocking Violence

Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!

Published Date :March 20, 2026 , 9:07 pm
By Kothuru Ram Kumar
Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Crime News: భార్య, భర్త మధ్య విభేదాలు, మనస్ఫర్థలు.. అనుమానాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కారణాలు ఏవైనా ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకోవడంతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఊర్లో బంధువుల వాదన మాత్రం మరోలా ఉంది. ఎస్సై చంద్రశేఖర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు ఆరోపించి.. ఆయన్ను వెంటపడి తరమడం అనుమానాలకు తావిస్తోంది. కరీంనగర్ టూటౌన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యతో 2016లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులున్నారు. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్నారు ఈ దంపతులు.

అయితే రోజు మాదిరిగానే పిల్లలను స్కూల్లో దింపిన చంద్రశేఖర్.. విధులకు హాజరయ్యేందుకు పీఎస్‌కు వెళ్లారు. బందోబస్తు విధుల్లో ఉండగానే భార్య దివ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసింది. దీంతో హుటాహుటిన వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె గన్నేరుపప్పు దంచుకుని తాగిందని.. చికిత్స చేస్తుండగా మరణించింది దివ్య… ఆమె తండ్రి సమ్మయ్య కూడా కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి సీతంపేటకు తరలించి అంత్యక్రియలు చేశారు.

S*exual Assault: పూజారి ముసుగులో కీచక పనులు.. అమ్మాయిపై అరాచకం..!

అయితే దివ్య మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. అంత్యక్రియలకు హాజరైన చంద్రశేఖర్‌‌పై దాడి జరుగుతుందనే సమాచారంతో అతన్ని ఓ ఇంట్లో దాచి అక్కడ నుంచి పోలీసులు తప్పించారనే ఆగ్రహించారు గ్రామస్తులు. దివ్య మరణం వెనక ఏం జరిగిందనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. అసలు గన్నేరు పప్పు ఎక్కడ లభ్యం అయింది? గన్నేరుపప్పు తింటే వెంటనే చనిపోతారా? అనేది అనుమానాలకు తావిస్తోంది. చంద్రశేఖర్.. దివ్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయనే టాక్ కూడా నడుస్తోంది. అయితే దివ్య తండ్రే కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు ఇవ్వడం వెనక ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. అది వస్తే గాని ఆత్మహత్య ఎలా జరిగిందనేది తేలే అవకాశాలున్నాయంటున్నారు.

మరోవైపు హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు సజీవ దహనమయ్యారు. ఈ ఫోటోలో ఉన్న ఈ దంపతుల పేర్లు ప్రవీణ్, రాజశ్రీ. వీళ్లకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. ఐతే ఇంట్లో నిద్రిస్తున్న రాజశ్రీ, ఆమె తండ్రి రాజశేఖర్ ఉన్నట్టుండి సజీవ దహనం అయ్యారు. తండ్రి, కూతురు విద్యుత్ ప్రమాదంలో చనిపోయారని అల్లుడు ప్రవీణ్.. బంధుమిత్రులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. బంధుమిత్రులు ఏం ప్రమాదం జరిగిందో.. ఎలా చనిపోయారో అనే ఆందోళనతో పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదం కాదని.. ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్స్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు ప్రవీణ్.. తన భార్య రాజశ్రీ, ఆమె తండ్రి రాజశేఖర్‌‌ని మొదట చంపి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు గుర్తించారు.

చింతల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కు.. రాజీవ్ గృహకల్పకు చెందిన రాజశ్రీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యభర్త మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అయితే ప్రవీణ్‌ ఏ పని లేకుండా తిరగడం స్టార్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న రాజశ్రీ తండ్రి రాజశేఖర్ కూతురి ఇంటికి వచ్చి అల్లుడు ప్రవీణ్‌ను మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అల్లుడు.. తన భార్య, మామ ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

మరో ఘటనలో భార్యపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు భర్త. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో కలకలం రేపింది. కొత్తగుంపులో వీరబోయిన నరేష్, విజయ దంపతులు నివసిస్తున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్యాంటిన్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కొన్ని రోజులుగా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో భార్య.. భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను అనుమానిస్తున్న భర్త ఎప్పుడూ.. ఆమెతో ఘర్షణ పడుతున్నాడు.

ఉగాది పండుగ రోజు భార్య భర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన విజయ భర్త నరేష్.. కొబ్బరి బోండాలను కట్ చేసే కత్తితో విజయపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడ, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు నరేష్. తొలుత విజయను మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ విజయకు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని MGM ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • crime news Telugu states
  • domestic violence cases
  • family disputes India
  • Hanamkonda murder case

తాజావార్తలు

  • Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions