Digital Health Cards: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు..
- 2026-27 వార్షిక బడ్జెట్ ప్రకటన..
- వైద్యారోగ్య శాఖకు భారీగా నిధులు కేటాయింపు..
- ఈ ఏడాది చివరి నాటికి టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకమైన 2026-27 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి భట్టి విక్రమార్క ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఎంతో కాలంగా ఆశిస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, 421 గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. దాదాపు 1,998 రకాల వ్యాధులకు ఎటువంటి ముందస్తు చెల్లింపులు లేకుండా (Cashless) వైద్యం అందుతుంది. ప్రతి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనున్నారు.
వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ..
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నిర్మిస్తున్న మూడు టిమ్స్ (TIMS) ఆసుపత్రులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే.. నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులు, వరంగల్లో నిర్మిస్తున్న అత్యధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు రోగులకు అందుబాటులోకి వస్తాయి.
వైద్య విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారామెడికల్ కళాశాలలను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వైద్య వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!