Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress leader’s son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్ శివమొగ్గ జిల్లాకు చెందిన వాడు. గురువారం కర్ణాటకలోని 6 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. బెంగళూర్, దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరెలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఐసిస్ తో సంబంధం ఉందని ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది.
Read Also: Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ఉడిపిలోని బ్రహ్మావర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాజుద్దీన్ షేక్ కొడుకే ఈ రేషాన్ షేక్. తాజుద్దీన్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు. ఈ అరెస్టులు జరిగినప్పటి నుంచి ఉడిపి ప్రాంతంలో తాజుద్దీన్ షేక్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ నేత కొడుకుకు ఐసిస్ లింకులు ఉండటంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తాజుద్దీన్ షేక్ కాంగ్రెస్ కార్యకర్త అని.. అతడిని పార్టీ తొలగిస్తుందా..? లేదా అని కాంగ్రెస్ తన వైఖరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హిజాబ్ నిరసనల సమయంలో కూడా కాంగ్రెస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అధికార కాషాయపార్టీ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. మతపరమైన హత్యల తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో అశాంతికి తాజుద్దీన్ కారణం అని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!