Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress leader’s son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్ శివమొగ్గ జిల్లాకు చెందిన వాడు. గురువారం కర్ణాటకలోని 6 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. బెంగళూర్, దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరెలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఐసిస్ తో సంబంధం ఉందని ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది.
Read Also: Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఉడిపిలోని బ్రహ్మావర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాజుద్దీన్ షేక్ కొడుకే ఈ రేషాన్ షేక్. తాజుద్దీన్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు. ఈ అరెస్టులు జరిగినప్పటి నుంచి ఉడిపి ప్రాంతంలో తాజుద్దీన్ షేక్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ నేత కొడుకుకు ఐసిస్ లింకులు ఉండటంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తాజుద్దీన్ షేక్ కాంగ్రెస్ కార్యకర్త అని.. అతడిని పార్టీ తొలగిస్తుందా..? లేదా అని కాంగ్రెస్ తన వైఖరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హిజాబ్ నిరసనల సమయంలో కూడా కాంగ్రెస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అధికార కాషాయపార్టీ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. మతపరమైన హత్యల తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో అశాంతికి తాజుద్దీన్ కారణం అని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..