Congress leader: కర్ణాటక గవర్నర్కి ‘‘బంగ్లాదేశ్’’ గతే.. వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత..
- బంగ్లాదేశ్ ప్రధాని పరిస్థితే గవర్నర్కి వస్తుంది..
- సీఎం సిద్ధరామయ్యపై విచారణను విరమించుకోవాలి..
- గవర్నర్కి కాంగ్రెస్ నేత వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress leader: కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ‘‘బంగ్లాదేశ్’’ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసౌజా గవర్నర్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతులు, నాయకులు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించి, గవర్నర్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు.
Read Also: Hezbollah: “ఫోన్ చేసి ముగ్గులోకి లాగి”.. షుక్ర్ ని హతం చేసిన ఇజ్రాయిల్ ఆపరేషన్..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
మంగళూరులో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఇవాన్ డిసౌజా మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే, బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్లు, గవర్నర్ కూడా పారిపోతారు. గవర్నర్ కార్యాలయం వద్ద తర్వాత నిరసన ఉంటుంది’’ అని అన్నారు. గవర్నర్ విచారణకు ఆదేశించడంపై సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆగస్టు 29 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుని హైకోర్టు ఆదేశించింది.
ముడా స్కాములో మైసూర్ నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాలు అప్పగించింది. 50:50 ప్రకారం భూయజమానులు అప్పటించిన భూమిలో సగాన్ని డెవలప్ చేసి మిగతా సగాన్ని యజమానులు మార్కెట్ రేటుకి అమ్ముకోవడం, పరిహారం ఇవ్వడం స్కీములో భాగం. అయితే, సీఎం భార్యకి ఆమె ఇచ్చిన స్థలంలో కాకుండా నగరంలోని సంపన్న ప్రదేశాలైన విజయనగరంలో 14 ఖరీదైన స్థలాలను కేటాయించడంపై వివాదం నెలకొంది. ఇది పరిహారంగా పొందిన స్థలాలు అసలు భూమి కన్నా ఖరీదైనవని ఆర్టీఐ కార్యకర్తలు కేసు ఫైల్ చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!