Rishab Shetty: బీజేపీకి కాంతారా స్టార్ సపోర్ట్.? బొమ్మైని కలిసిన రిషబ్ శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంతారా స్టార్ రిషబ్ శెట్టి కూడా బీజేపీకి మద్దతు ఇస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం ఉడిపిలో సీఎం బసవరాజ్ బొమ్మై, రిషబ్ శెట్టి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు ఇద్దరు కలిసి ఉడిపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరు కలిసి ఆలయంలో కనిపించడంతో కన్నడ నాట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కిచ్చా సుదీప్ లాగే రిషబ్ శెట్టి కూడా మద్దతు ఇస్తారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: Laxman Savadi: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం!
ఇదిలా ఉంటే ఈ కలయికపై రిషబ్ శెట్టి స్పందించారు.. ‘నో పొలిటికల్ కలర్’ అంటూ వ్యాఖ్యానించారు. నేరు కొల్లూరు మూకాంబిక దర్శనానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిశానని, దీంట్లో ఎలాంటి రాజకీయ రంగు లేదని, ప్రస్తుతం నాను కాంతారా స్క్రిప్టు రచనలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. మీ అందరి ప్రేమ ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. కాంతారా సూపర్ హిట్ తర్వాత కాంతారా-2 ఉంటుందని ఇప్పటికే రిషబ్ శెట్టి స్పష్టం చేశారు.
కొల్లూరులో సీఎం బొమ్మైని చూసి రిషబ్ శెట్టి కాళ్లకు నమస్కరించారు. బొమ్మై, రిషబ్ శెట్టి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి బొమ్మై ఈ విషయంపై మాట్లాడుతూ.. రిషబ్ కొల్లూరు వచ్చినట్లు నాకు తెలియదు. రిషబ్ నాకు మంచి స్నేహితుడు, అతను మా భావజాలానికి దగ్గరగా ఉన్నాడు, ఎన్నికల ప్రచారం గురించి ఆయనతో మాట్లాడలేదు. ప్రస్తుతం రిషబ్ ను ఉపయోగించుకునే ఆలోచన లేదు అని ఆయన అన్నారు. గతేడాది కాంతారా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. కాంతార-2 ఏప్రిల్ 2024లో ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?