Congress: ఢిల్లీ కాంగ్రెస్లో సంక్షోభం.. పార్టీ చీఫ్ రాజీనామా, కన్హయ్య కుమార్పై నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని విబేధాలతో పాటు, కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కన్హయ్య కుమార్ బహిరంగంగా ఆప్ నేతలకు, అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు.
ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు సొంత పార్టీ నేత ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అతని ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ..‘‘ స్థానిక వ్యక్తి కావాలి, బయటి వ్యక్తి కాదు’’ అంటూ నల్ల పోస్టర్లను ప్రదర్శించారు. కన్హయ్య కుమార్ ఆప్, ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ని ప్రశంసించారని ఆరోపించారు. ‘‘ఈశాన్య ఢిల్లీకి చెందిన అభ్యర్థి కూడా పార్టీకి, కార్యకర్తల నమ్మకానికి విరుద్ధంగా ఢిల్లీ సీఎంని పొగుడుతూ మీడియా బైట్లు ఇస్తున్నారు’’ అని చెప్పారని అరవిందర్ సింగ్ లవ్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఆయన లవ్లీ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతల్ని పట్టించుకోలేదని, బయటి వ్యక్తులకు టికెట్ కేటాయించారని అన్నారు. మాజీ జెఎన్యూ స్టూడెంట్ యూనిమన్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్లో చేరారు. 2019లో సీపీఐ తరుపున బెగుసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, బీజేపీ ఢిల్లీ పరిణామాలపై కాంగ్రెస్ని విమర్శిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. సాయుధ బలగాలను అవమానపరుస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. షీలా దీక్షిత్, సోనియాగాంధీలను జైల్లో పెడతామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికికి ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని, మద్యం కుంభకోణంలో ఆప్ ప్రమేయం గురించి కాంగ్రెనస్ ఫిర్యాదు చేసింది, కానీ రాజకీయ కారణాలతో రెండు పార్టీలు ఒక్కటయ్యాయని పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!