Congress: ఢిల్లీ కాంగ్రెస్లో సంక్షోభం.. పార్టీ చీఫ్ రాజీనామా, కన్హయ్య కుమార్పై నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని విబేధాలతో పాటు, కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కన్హయ్య కుమార్ బహిరంగంగా ఆప్ నేతలకు, అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు.
ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు సొంత పార్టీ నేత ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అతని ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ..‘‘ స్థానిక వ్యక్తి కావాలి, బయటి వ్యక్తి కాదు’’ అంటూ నల్ల పోస్టర్లను ప్రదర్శించారు. కన్హయ్య కుమార్ ఆప్, ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ని ప్రశంసించారని ఆరోపించారు. ‘‘ఈశాన్య ఢిల్లీకి చెందిన అభ్యర్థి కూడా పార్టీకి, కార్యకర్తల నమ్మకానికి విరుద్ధంగా ఢిల్లీ సీఎంని పొగుడుతూ మీడియా బైట్లు ఇస్తున్నారు’’ అని చెప్పారని అరవిందర్ సింగ్ లవ్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఆయన లవ్లీ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతల్ని పట్టించుకోలేదని, బయటి వ్యక్తులకు టికెట్ కేటాయించారని అన్నారు. మాజీ జెఎన్యూ స్టూడెంట్ యూనిమన్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్లో చేరారు. 2019లో సీపీఐ తరుపున బెగుసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, బీజేపీ ఢిల్లీ పరిణామాలపై కాంగ్రెస్ని విమర్శిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. సాయుధ బలగాలను అవమానపరుస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. షీలా దీక్షిత్, సోనియాగాంధీలను జైల్లో పెడతామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికికి ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని, మద్యం కుంభకోణంలో ఆప్ ప్రమేయం గురించి కాంగ్రెనస్ ఫిర్యాదు చేసింది, కానీ రాజకీయ కారణాలతో రెండు పార్టీలు ఒక్కటయ్యాయని పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!