Congress: ఢిల్లీ కాంగ్రెస్లో సంక్షోభం.. పార్టీ చీఫ్ రాజీనామా, కన్హయ్య కుమార్పై నిరసన..
Congress: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని విబేధాలతో పాటు, కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కన్హయ్య కుమార్ బహిరంగంగా ఆప్ నేతలకు, అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు.
ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు సొంత పార్టీ నేత ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అతని ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ..‘‘ స్థానిక వ్యక్తి కావాలి, బయటి వ్యక్తి కాదు’’ అంటూ నల్ల పోస్టర్లను ప్రదర్శించారు. కన్హయ్య కుమార్ ఆప్, ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ని ప్రశంసించారని ఆరోపించారు. ‘‘ఈశాన్య ఢిల్లీకి చెందిన అభ్యర్థి కూడా పార్టీకి, కార్యకర్తల నమ్మకానికి విరుద్ధంగా ఢిల్లీ సీఎంని పొగుడుతూ మీడియా బైట్లు ఇస్తున్నారు’’ అని చెప్పారని అరవిందర్ సింగ్ లవ్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఆయన లవ్లీ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతల్ని పట్టించుకోలేదని, బయటి వ్యక్తులకు టికెట్ కేటాయించారని అన్నారు. మాజీ జెఎన్యూ స్టూడెంట్ యూనిమన్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్లో చేరారు. 2019లో సీపీఐ తరుపున బెగుసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, బీజేపీ ఢిల్లీ పరిణామాలపై కాంగ్రెస్ని విమర్శిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. సాయుధ బలగాలను అవమానపరుస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. షీలా దీక్షిత్, సోనియాగాంధీలను జైల్లో పెడతామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికికి ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని, మద్యం కుంభకోణంలో ఆప్ ప్రమేయం గురించి కాంగ్రెనస్ ఫిర్యాదు చేసింది, కానీ రాజకీయ కారణాలతో రెండు పార్టీలు ఒక్కటయ్యాయని పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!