Kamal Haasan: ‘ఉదయనిధి చిన్నపిల్లవాడు’.. సనాతన వ్యాఖ్యలపై స్పందించిన కమల్ హాసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా సద్దుమణగడం లేదు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ యాక్టర్, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు.
సనాతన్ అనే పదం పెరియార్ నుంచి వచ్చిందని, ఉదయనిధి కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారని కమల్ హాసన్ శుక్రవారం అన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకు చిన్న పిల్లవాడు ఉదయనిధిని వెంటాడుతున్నారని అన్నారు. పెరియార్ వల్లే సనాతన అనే పదం అందరికి తెలిసిపోయిందని, పెరియార్ తమ వాడని ఏ పార్టీ కూడా చెప్పుకోదని, ఆయన తమిళనాడుకు సొంతమని కమల్ హాసన్ చెప్పారు.
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
Read Also: USA: బార్లోకి అనుమతి నిరాకరణ.. ఐదుగురిని కాల్చి చంపిన మహిళ
ఒకప్పుడు పెరియార్ గుడిలో పనిచేసేవాడని, వారణాసిలో నుదుట తిలకం పెట్టుకుని పూజలు చేస్తుండే వాడని, వాటన్నింటిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించండి అని ఆయన అన్నారు. ఆయన జీవితమంతా ప్రజల సేవతోనే గడిచిందని తెలిపారు.
కమల్ హాసన్ ఇంతకుముందు కూడా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొనడం ఉదయనిధి వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సంకుచిత రాజకీయ భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.
సనాతన వివాదంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు కూటమిని టార్గెట్ చేసింది. ప్రధాని మోడీ నుంచి కేంద్రమంత్రులు దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని తుడిచివేయడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తుందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!