Jyoti Malhotra: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏజెంట్లతో జ్యోతి మల్హోత్రా సంప్రదింపులు..
- యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో సంచలన విషయాలు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఏజెంట్లతో సంప్రదింపులు.. గతంలో పాకిస్తాన్, చైనా దేశాల్లో పర్యటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్థానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జ్యోతితో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం, హర్యానా హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏజెంట్లలో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే, రక్షణ సమాచారం పంచుకుందా..? లేదా.? అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Read Also: Russia: 11 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగార కోర్కెలు.. తొమ్మిదేళ్ల జైలు శిక్ష..
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
పహల్గామ్ పర్యటన రహస్యాలను, పాకిస్తాన్ ఈమెను ఆస్తిగా ఉపయోగించుకున్న కుట్ర బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు జ్యోతి కాశ్మీర్, పాకిస్తాన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. జ్యోతి చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయం లోని అధికారి ద్వారా జ్యోతి పాకిస్తాన్ లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టం. మాజీ ప్రధాని కూతురు, ఇప్పుడు పాక్ పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్న మరియం నవాజ్తో ఉన్న జ్యోతి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
జ్యోతి తన ఆదాయం కన్నా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెతో పాటు మరికొందరు ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్తాన్ ఇమేజ్ పెంచేలా కథనాన్ని సెట్ చేసినట్లు తేలింది. హిసార్ ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తమకు జ్యోతి గురించి సమాచారం అందిందని, ఆ తర్వాత నిఘా పెట్టామని, ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజుల రిమాండ్ ఉందని, విచారిస్తున్నామని చెప్పారు.
Hisar, Haryana: On the arrest of YouTuber Jyoti Malhotra for allegedly spying for Pakistan, SP Hisar Shashank Kumar Sawan says, "During the conflict, she was in contact with PIOs… Although she remained in touch with PIOs, she did not have any direct access to critical military… pic.twitter.com/N8Z5Fez4mh
— IANS (@ians_india) May 18, 2025
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!