Canada: జీ20లో ప్రెసిడెన్షియల్ సూట్ తిరస్కరించిన ట్రూడో.. ముందు నుంచే భారత్ని నిందించే ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఇటీవల భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహించింది. సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధినేతలు, అధికారులు మొత్తం 30 మందికిపైగా అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, యూకే పీఏం రిషి సునాక్, చైనా ప్రీమియర్ లీ కియాంగ్ వంటి వారు హాజరయ్యారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. పలు దేశాలకు చెందిన అగ్రనేతలకు భారత్ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. లగ్జరీ హోటళ్లలో ప్రెసిడెన్షియల్ సూట్లను ఏర్పాటు చేసింది.
Read Also: Switzerland: అక్కడ బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
అయితే కెనడా ప్రధాని ట్రూడో మాత్రం ఢిల్లీలోని లలిత్ లగ్జరీ హోటల్ లో ప్రెసిడెన్షియల్ సూట్ నిరాకరించినట్లు అధికారులు నివేదిక వెల్లడించింది. దీనికి బదులుగా సాధారణ రూంలోనే బస చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతీ గ్లోబల్ లీడర్ కోసం ప్రెసిడెన్షియల్ సూట్లను భారత భద్రతా ఏజెన్సీలు ప్రత్యేకంగా రూపొందించాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో ప్రధాని మోడీ, ట్రూడో మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖలిస్తాన్ సమస్య ప్రధాన ఎజెండాగా మారిందని తెలుస్తోంది. సమావేశం అనంతరం కెనడా బయలుదేరాల్సి ఉన్నా.. ట్రూడో విమానంలో సాంకేతిక లోపం కారణంగా కొన్ని రోజులు భారత్ లోనే ఉన్నారు. ఇండియా ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఆఫర్ చేసినా తిరస్కరించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖలిస్తాన్ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడాకు వెళ్లగానే ట్రూడో సర్కార్, ఇండియా-కెనడా వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసినట్లు ప్రకటించింది. ఇదే కాకుండా ఆ దేశ ప్రధాని ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియానే కారణమని ఆరోపించాడు. అంతే కాకుండా దేశంలోని భారత రాయబారిని బహిష్కరించారు. దీనికి ప్రతిగా ఇండియా కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జీ20 సమావేశాలకు ముందే నిజ్జర్ హత్యపై భారత్ ని నిందించాలని కెనడా ప్రభుత్వం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలను కోరినట్లు సమాచారం. అయితే అందుకు ఆయా దేశాలు నిరాకరించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!