Justice UU Lalit: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Lalit will take charge as the CJI of the Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మూడు తరాలుగా యు. యు. లలిత్ కుటుంబం న్యాయవాద వృత్తిలో ఉంది. గతంలో పలు కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. భారత్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా యు. యు. లలిత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రముఖమైన కేసులు ఆయన ముందుకు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే రహస్య ఎన్నికల బాండ్లు, మతం ప్రాతిపదికన పౌరసత్వం వంటి ప్రముఖమైన కేసులు యు. యు. లలిత్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
యు. యు. లలిత్ కుటుంబం గత మూడు తరాలుగా న్యాయవాద వృత్తిలోనే ఉంది. ఈయన తాత మహారాష్ట్ర షోలాపూర్ లో న్యాయవాది. ఆ తరువాత జస్టిస్ లలిత్ తండ్రి ఉమేష్ రంగనాథ్ లలిత్ కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. ఆయన హైకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం లలిత్ దేశ అత్యున్నత పదవి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు. జస్టిస్ లలిత్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో ఒకరు న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతున్నారు. బార్ కౌన్సిల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన రెండవ వ్యక్తిగా లలిత్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఇలా ఎస్ఎం సిక్రీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
జస్టిస్ లలిత్, ముస్లింలలో తక్షణ ‘‘ ట్రిపుల్ తలాక్’’ కేసులో తీర్పు చెప్పారు. దీంతో పాటు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిల్లల శరీర భాగాలను లైంగిక ఉద్దేశంతో తాకడం కూడా లైంగిక వేధింపులతో సమానమనే తీర్పును ఇచ్చారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూమిహక్కు వివాదంలో విచారణ జరిపిన బెంచ్ లో కూడా లలిత్ ఉన్నారు. 2జి స్పెక్ట్రమ్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. ప్రస్తుతం 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లలిత్ పదవీకాలం ఆయనకు 65 ఏళ్లు నిండిన సమయంలో అంటే నవంబర్ 8న ముగుస్తుంది.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!