JP Nadda: రాష్ట్రపతికి మల్లికార్జున్ ఖర్గే లేఖ.. జేపీ నడ్డా కౌంటర్
- మణిపూర్లో కొనసాగుతున్న మైటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు..
- ఈ గొడవపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే లేఖ..
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కౌంటర్ లేఖ రాసిన జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: మణిపూర్లో మైటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. అందులో మణిపూర్ లో దిగజారుతున్న పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని కోరారు. అక్కడ పరిస్థితి రోజురోజుకు ఎలా దిగజారుతుందో తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం.. వేల మంది నిరాశ్రయులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. ఇక, ఖర్గే లేఖకు కౌంటర్ గా కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేటర్ రాశారు.
Read Also: Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..
Also Read
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
ఇక, జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు. విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా.. కేంద్ర మాజీ హోంమంత్రిగా ఉన్న పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి కూడా మీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది అని జేపీ నడ్డా ఆరోపించారు.
Read Also: Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
అలాగే, మీ(కాంగ్రెస్) ప్రభుత్వంలో భారతదేశం యొక్క భద్రత, పరిపాలనాలో పూర్తి వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక, మణిపూర్లో శాంతిని నెలకొల్పితే.. దానిని ధ్వంసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని అనేక దశాబ్దాల వెనక్కి నెట్టడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న ప్రధాన కారణాలలో ఒకటి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు.
తాజావార్తలు
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!