JP Nadda: రాష్ట్రపతికి మల్లికార్జున్ ఖర్గే లేఖ.. జేపీ నడ్డా కౌంటర్
- మణిపూర్లో కొనసాగుతున్న మైటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు..
- ఈ గొడవపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే లేఖ..
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కౌంటర్ లేఖ రాసిన జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: మణిపూర్లో మైటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. అందులో మణిపూర్ లో దిగజారుతున్న పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని కోరారు. అక్కడ పరిస్థితి రోజురోజుకు ఎలా దిగజారుతుందో తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం.. వేల మంది నిరాశ్రయులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. ఇక, ఖర్గే లేఖకు కౌంటర్ గా కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేటర్ రాశారు.
Read Also: Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..
Also Read
ఇక, జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు. విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా.. కేంద్ర మాజీ హోంమంత్రిగా ఉన్న పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి కూడా మీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది అని జేపీ నడ్డా ఆరోపించారు.
Read Also: Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
అలాగే, మీ(కాంగ్రెస్) ప్రభుత్వంలో భారతదేశం యొక్క భద్రత, పరిపాలనాలో పూర్తి వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక, మణిపూర్లో శాంతిని నెలకొల్పితే.. దానిని ధ్వంసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని అనేక దశాబ్దాల వెనక్కి నెట్టడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న ప్రధాన కారణాలలో ఒకటి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!