Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
- నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్..
- గోవాలో భారత ఫిషింగ్ బోట్ 'మార్తోమా', భారత నౌకాదళ నౌకలు ఢీ
- ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్.
Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నావికాదళం ఆరు నౌకలు, విమానాలను మోహరించింది.
Also Read: East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
Also Read
దీనితో పాటు, ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఇండియన్ నేవీ వెంటనే సమీపంలోని ఓడలు, విమానాలను అక్కడికి పంపింది. తద్వారా ప్రాణాలతో బయటపడిన వారిని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చారు. నౌకాదళ నౌకలు, విమానాలు కాకుండా.. ఇతర వనరులు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా పూర్తి సంసిద్ధతతో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ఈ ఘర్షణ ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని, అయితే ప్రస్తుతం గల్లంతైన మత్స్యకారుల ఆచూకీకే ప్రాధాన్యతనిస్తున్నారు నేవీ అధికారులు. ఈ ఘటన సముద్ర భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన తాజా సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన సభ్యులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు.
Also Read: Vijay : హాలీవుడ్ స్ఫూర్తితో.. రూ.80కోట్ల బడ్జెట్ తో విజయ్ `నీలంకరై`
తాజావార్తలు
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
-
Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!