Collide Two Boats: నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్
- నావికాదళ నౌకను ఢీకొన్న ఫిషింగ్ బోట్..
- గోవాలో భారత ఫిషింగ్ బోట్ 'మార్తోమా', భారత నౌకాదళ నౌకలు ఢీ
- ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నావికాదళం ఆరు నౌకలు, విమానాలను మోహరించింది.
Also Read: East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
దీనితో పాటు, ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఇండియన్ నేవీ వెంటనే సమీపంలోని ఓడలు, విమానాలను అక్కడికి పంపింది. తద్వారా ప్రాణాలతో బయటపడిన వారిని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చారు. నౌకాదళ నౌకలు, విమానాలు కాకుండా.. ఇతర వనరులు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా పూర్తి సంసిద్ధతతో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ఈ ఘర్షణ ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని, అయితే ప్రస్తుతం గల్లంతైన మత్స్యకారుల ఆచూకీకే ప్రాధాన్యతనిస్తున్నారు నేవీ అధికారులు. ఈ ఘటన సముద్ర భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన తాజా సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన సభ్యులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు.
Also Read: Vijay : హాలీవుడ్ స్ఫూర్తితో.. రూ.80కోట్ల బడ్జెట్ తో విజయ్ `నీలంకరై`
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?