JP Nadda: మోడీ కేబినెట్లోకి జేపీ నడ్డా.. బీజేపీకి కొత్త చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సీషెల్స్ వంటి దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మోడీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో జేపీ నడ్డా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014-2019లో నరేంద్రమోడీ తొలి ప్రభుత్వంలో నడ్డా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ చూశారు. 2020లో అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా చేశారు. సెప్టెంబర్ 2022లో నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడగించారు. ఇదే జరిగితే బీజేపీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మోడీ 3.0 కేబినెట్లో ఈ సారి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనలకు ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జెడి(యు) నుండి లల్లన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్లు నేడు ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ లోక్దళ్కు చెందిన జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ ఆర్వి చిరాగ్ పాశ్వాన్, శివసేనకు చెందిన ప్రతాప్ రావ్ జాదవ్, హెచ్ఎఎం జితన్ రామ్ మాంఝీ, ఎజెఎస్యుకు చెందిన చంద్ర ప్రకాష్ చౌదరి, ఆర్పిఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, జేడీఎస్ నుంచి కుమారస్వామిలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!