JP Nadda: మోడీ కేబినెట్లోకి జేపీ నడ్డా.. బీజేపీకి కొత్త చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సీషెల్స్ వంటి దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మోడీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో జేపీ నడ్డా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014-2019లో నరేంద్రమోడీ తొలి ప్రభుత్వంలో నడ్డా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ చూశారు. 2020లో అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా చేశారు. సెప్టెంబర్ 2022లో నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడగించారు. ఇదే జరిగితే బీజేపీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
మోడీ 3.0 కేబినెట్లో ఈ సారి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనలకు ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జెడి(యు) నుండి లల్లన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్లు నేడు ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ లోక్దళ్కు చెందిన జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ ఆర్వి చిరాగ్ పాశ్వాన్, శివసేనకు చెందిన ప్రతాప్ రావ్ జాదవ్, హెచ్ఎఎం జితన్ రామ్ మాంఝీ, ఎజెఎస్యుకు చెందిన చంద్ర ప్రకాష్ చౌదరి, ఆర్పిఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, జేడీఎస్ నుంచి కుమారస్వామిలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!