Jharkhand: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ అత్యాచార ఘటన సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిదిలోని బకోరియా భలువాహీ వ్యాలీ సమీపంలో జరిగిందని జిల్లా ఎస్పీ చందన్ కుమార్ సిన్హా వెల్లడించారు. పాలము జిల్లా పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 22 ఏళ్ల యువతి తన అత్తామామలతో గొడవ పడి శనివారం కాలినడకన పక్కనే ఉన్న లతేహార్ జిల్లాలోని మానిక పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తన తండ్రి ఇంటికి బయలుదేరింది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: IT Firm Cheating Case: బోర్డు తిప్పేసిన కంపెనీ.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం
భార్య కోసం భర్త మరో బంధువుతో కలిసి మోటర్ సైకిల్ పై వెతకడం ప్రారంభించారు. ఆమెను రాత్రి 8 గంటల సమయంలో సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 39పై నడుచుకుంటూ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన భర్త.. ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు భర్తను, అతని బంధువును తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త కళ్లెదుటే ఆరుగురు వ్యక్తులు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను బాధితురాలి భర్త గుర్తించాడు.
ఈ ఘటన తర్వాత బాధితురాలిని నిందితులు వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో గ్రామస్తులు వచ్చిన యువతిని రక్షించారు. ఇద్దరు నిందితులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మేదినీనగర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. సత్బర్వా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రిషికేస్ కుమార్ రాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!