CBI: అక్రమాస్తుల కేసు.. కాంగ్రెస్ నేతకు మూడేళ్ల జైలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది.
Read Also: Flight: ఢిల్లీలో కరెంట్ పోల్ను ఢీకొట్టిన విమానం..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
2005-2009 మధ్యకాలంలో మధు కోడా ప్రభుత్వంలో తిర్కీ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.6,28,698 అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.. సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ 2009లో దిగువ కోర్టులో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్ కోర్టు జూలై 1, 2009న విచారణకు ఆదేశించింది. 1 ఆగస్టు 2010లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై కేసు నమోదు చేసింది సీబీఐ. మందార్ ఎమ్మెల్యేగా 2005 నుంచి జూన్ 2009 వరకు రూ.6.28లక్షలు ఆదాయానికి మించి సంపాదించినట్లు తన విచారణలో సీబీఐ తేల్చింది.. ఇక, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు 21 మంది సాక్షులు, డిఫెన్స్ తరఫున ఎనిమిది సాక్షులను హాజరుపరిచారు.. ఇక, ఇవాళ తిర్కీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.. కోర్టు ఆదేశాలపై 62 ఏళ్ల మందార్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. “నేను కోర్టును విశ్వసిస్తున్నాను.. నేను నా లాయర్తో మాట్లాడతాను” అని పేర్కొన్నారు.. కాగా, ఇదే కేసులో 2018లో రాంచీ జిల్లాలోని బన్హోరాలో బంధు తిర్కీని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఇక, ఎన్నికల అఫిడవిట్లో బంధుత్ తిర్కీ తన ఆస్తులను రూ.60,000 నగదు, కారు చూపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని వసంత్ విహార్లో రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. మరోవైపు, జార్ఖండ్ నేతకు వివాదాలు కొత్తేమీ కాదు.. ఇప్పటికే పలు కుంభకోణాలు వెలుగుచూశాయి.
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!