Bihar Politics: సీఎం నితీష్ కుమార్ కు బీజేపీ స్కెచ్..? కీలక జేడీయూ నేతతో బీజేపీ నేతలు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో ఎన్డీయేలో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. ఆ పొత్తు కాదనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గతం నుంచి బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జేడీయూ చీల్చి అధికారం ఏర్పాటు చేయాలనుకుంటుందనే ఆరోపణతోనే సీఎం నితీస్ కుమార్ బీజేపీ పొత్తును కాదనుకున్నాడు.
Read Also: Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహాను బీజేపీ నేతలు కలవడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన జేడీయూ నుంచి బీజేపీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చీఫ్ గా ఉన్న ఉపేంద్ర కుష్వాహా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఆయనను కలిశారు. ఈ ఫోటో ప్రస్తుత బీహార్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. కుష్వాహాను బీజేపీలోకి ఆహ్మానిస్తామని రాష్ట్ర బీజేపీ పేర్కొంది.
బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో ఉపేంద్ర కుష్వాహా మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి, జాతీయవాద రాజకీయాల వైపు మొగ్గు చూపే నేతలంతా మా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. రొటీన్ చెకప్ కోసం ప్రస్తుతం ఎయిమ్స్లో చేరిన కుష్వాహను బీజేపీ నేతలు ప్రేమ్ రంజన్ పటేల్, సంజయ్ టైగర్, యోగేంద్ర పాశ్వాన్ పరామర్శించారు. జేడీయూలోకి తిరిగి రావడానకి కుష్వాహా తన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని(ఆర్ఎల్ఎస్పీ)ని జేడీయూలో రెండేళ్ల క్రితం విలీనం చేశారు. ఇటీవల కుష్వాహా తాను డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నితీష్ కుమార్ దీన్ని కొట్టి పారేశారు. అయితే అతను బీజేపీలో చేరకున్నా.. ఓ కొత్త పార్టీని ప్రారంభించి ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!