Bihar Politics: సీఎం నితీష్ కుమార్ కు బీజేపీ స్కెచ్..? కీలక జేడీయూ నేతతో బీజేపీ నేతలు భేటీ
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో ఎన్డీయేలో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. ఆ పొత్తు కాదనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గతం నుంచి బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జేడీయూ చీల్చి అధికారం ఏర్పాటు చేయాలనుకుంటుందనే ఆరోపణతోనే సీఎం నితీస్ కుమార్ బీజేపీ పొత్తును కాదనుకున్నాడు.
Read Also: Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఇదిలా ఉంటే ప్రస్తుతం జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహాను బీజేపీ నేతలు కలవడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన జేడీయూ నుంచి బీజేపీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చీఫ్ గా ఉన్న ఉపేంద్ర కుష్వాహా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఆయనను కలిశారు. ఈ ఫోటో ప్రస్తుత బీహార్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. కుష్వాహాను బీజేపీలోకి ఆహ్మానిస్తామని రాష్ట్ర బీజేపీ పేర్కొంది.
బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో ఉపేంద్ర కుష్వాహా మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి, జాతీయవాద రాజకీయాల వైపు మొగ్గు చూపే నేతలంతా మా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. రొటీన్ చెకప్ కోసం ప్రస్తుతం ఎయిమ్స్లో చేరిన కుష్వాహను బీజేపీ నేతలు ప్రేమ్ రంజన్ పటేల్, సంజయ్ టైగర్, యోగేంద్ర పాశ్వాన్ పరామర్శించారు. జేడీయూలోకి తిరిగి రావడానకి కుష్వాహా తన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని(ఆర్ఎల్ఎస్పీ)ని జేడీయూలో రెండేళ్ల క్రితం విలీనం చేశారు. ఇటీవల కుష్వాహా తాను డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నితీష్ కుమార్ దీన్ని కొట్టి పారేశారు. అయితే అతను బీజేపీలో చేరకున్నా.. ఓ కొత్త పార్టీని ప్రారంభించి ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!