Coimbatore Blast: కేసులో కొత్త కోణం.. శ్రీలంక తరహాలో పేలుళ్లకు కుట్ర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jamisha Mubin Planned Srilanka Easter Attack In Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించగా.. ఈ ఘటనలో 25 ఏళ్ల జమేషా ముబీన్ మృతి చెందాడు. అతనికి.. శ్రీలంకలో ఈస్టర్ రోజున పేలుడు జరిపిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే.. ఈస్టర్ పేలుళ్ల నిందితుల్ని ముబీన్ కలిశాడని, ఆ పేలుళ్ల తరహాలోనే అతడు కోయంబత్తూరులో ప్లాన్ చేశాడని విచారణలో తేలింది. దీపావళి పండుగ సమయంలో.. కోయంబత్తూరు దేవాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించిన నేపథ్యంలో తమిళనాడు పోలీసులతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ముబీన్ ఇంటి నుంచి పేలుడు పదార్థాల తయారీలో వినియోగించే 75 కేజీల వస్తువులు, కెమికల్స్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. అతనితో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లు ముబీన్ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను తీసుకొని పరారవ్వగా.. అధికారులు గాలింపు చర్యలు చేపట్టి, అదుపులోకి తీసుకున్నారు. 2019లో ఈ ముబిన్ను ఎన్ఐఏ విచారించినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనలో పేలిన కారు.. ఇప్పటివరకూ 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి.. భవిష్యత్తులో ఏదో ప్లాన్ చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఇదివరకే వెల్లడించారు.
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
మరోవైపు.. అధికారులు అరెస్ట్ చేసిన ఐదుగురు అనుమానితుల్లో కొందరు కేరళ కూడా వెళ్లి వచ్చినట్టు తాము భావిస్తున్నామని, ఇంకా దర్యాప్తు సాగుతోందని పోలీసు కమిషనర్ వి. బాలకృష్ణన్ చెప్పారు. ఈ కేసులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని తాము అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అల్-ఉమా వ్యవస్థాపకుడైన ఎస్ఏ బాషా సోదరుడు నవాజ్ ఖాన్, కొడుకు మహమ్మద్ తాలిఖ్ కోయంబత్తూరులోనే ఉన్నారన్నారు. 1996లో ఇదే నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో బాషా ప్రధాన నిందితుడని.. ఆ పేలుళ్లలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారన్నారు.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!