Jai Shankar: అందుకే పాక్ పహల్గామ్ దాడి చేసింది.. ట్రంప్ వాదన అంతా తప్పు.
- ఆర్థికంగా అస్థిరపరచడానికే పాక్ ‘‘పహల్గామ్ టెర్రర్ అటాక్’’..
- ట్రంప్కి భారత్-పాక్ కాల్పుల విరమణతో సంబంధం లేదు..
- మరోసారి స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Shankar: జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్లో న్యూస్వీక్తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
Read Also: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని ట్రంప్ చేసిన వాదనల్ని జైశంకర్ తోసిపుచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడిన సమయంలో తాను కూడా అదే గదిలో ఉన్నానని వెల్లడించారు. ‘‘మే 9 రాత్రి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాని మోడీతో మాట్లాడుతున్న సమయంలో నేను అదే గదిలో ఉన్నాను. పాక్ నుంచి భారత్పైకి భారీ దాడి ఉంటుందని చెప్పారు. అయితే, మేము దానిని ఒప్పుకోలేదు. పాకిస్తాన్ బెదిరింపులకు ప్రధాని మోడీ పట్టించుకోలేదు. ప్రధాని మోడీ మా ప్రతిస్పందన చలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు’’ అని జైశంకర్ తెలిపారు.
మే 9 రాత్రి, పాకిస్తా్న్ భారత్పై భారీ దాడి చేసిందని, కానీ భారత దళాలు చాలా త్వరితంగా స్పందించినట్లు వెల్లడించారు. తర్వాత రోజు ఉదయం యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాక్ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని జైశంకర్ వెల్లడించారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ కాషిఫ్ అబ్దుల్లా, భారత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ రాజీవ్ ఘాయ్కు కాల్ చేసి కాల్పుల విరమణ కోరారని చెప్పారు.
తాజావార్తలు
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
-
YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..