G20 Summit: “జై సియా రాం”తో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కి స్వాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మోలొని, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఒమన్ ప్రధాని సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ ఢిల్లీకి చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతదేశానికి వచ్చారు.సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి.
Read Also: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధం.. ఆయా నాయకులకు అందిస్తాం: అమితాబ్ కాంత్
Also Read
యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తికి కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే పాలం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ‘జై సియా రాం’ అంటూ కేంద్ర మంత్రి వీరిద్దరిని రిసీవ్ చేసుకున్నారు. రిషి సునాక్ దంపతులకు భగవద్గీత, హనుమాన్ చాలీసాని, రుద్రాక్షను బహూకరించారు. తన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందిగా రిషి సునాక్ అన్నారు. రిషిసునాక్ ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహమాడారు. తొలి భారత-బ్రిటిష్ సంతతి ప్రధానిగా ఉన్నారు.
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా రిషి సునాక్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్వేచ్చా వాణిజ్యం ఒప్పందం గురించి ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. జీ20 సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండియా అందుకు తగ్గట్లుగానే భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు 40కి పైగా దేశాధినేతలు, ఇతర నాయకులు, అధికారులు హాజరవుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?