G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధం.. ఆయా నాయకులకు అందిస్తాం: అమితాబ్ కాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: ఢిల్లీలో జీ20 సమ్మిట్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడారు. జీ20 సమ్మిట్ ముగింపులో న్యూఢిల్లీ నాయకుల ప్రకటన గ్లోబల్ సౌత్ స్వరాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్, వర్ధమాన దేశాల కోసం ప్రపంచంలో ఏ డాక్యుమెంట్ కూడా ఇంత బలమైన వాయిస్ కలిగి ఉండదని అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధంగా ఉందనీ, దీనిని ఆయా నాయకులకు అందిస్తామని చెప్పారు. బాలిలో జీ20 అధ్యక్ష పదవిని భారత్ చేజిక్కించుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి, ఉత్పాదకత మందగించిన పరిస్థితిలో ఉందని అమితాబ్ కాంత్ అన్నారు.గ్రీన్ డెవలప్మెంట్, క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫైనాన్స్ కూడా భారతదేశ ప్రాధాన్యతలలో ఉన్నాయని అన్నారు. భారతదేశ అధ్యక్ష పదవి అందరినీ కలుపుకొని పోవాలని, నిర్ణయాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణతో కూడుకున్నదిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారని ఆయన అన్నారు.
Also Read: Bypolls Results 2023:ఘోసిలో ఇండియా కూటమి హవా.. త్రిపురలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ విజయం
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్తో అధ్యక్ష పదవిని ప్రారంభించాలని భారతదేశం భావించిందని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రపంచం ఒక కుటుంబంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. భారత అధ్యక్ష పదవీకాలంలో సమ్మిళిత, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారిత, చాలా నిర్ణయాత్మకంగా ఉండాలనే ఆయన దార్శనికతకు అనుగుణంగా మేము ముందుకు సాగుతున్నామని అమితాబ్ కాంత్ అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ చర్యలతో సహా జీ20 అధ్యక్ష పదవికి భారతదేశ కీలక ప్రాధాన్యతల గురించి ఆయన మాట్లాడారు.169 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కేవలం 12 మాత్రమే పూర్తయ్యాయని, షెడ్యూల్ కంటే చాలా వెనుకబడి ఉన్నామని అమితాబ్ కాంత్ చెప్పారు. మనం 2030 యాక్షన్ పాయింట్ వద్ద ఉన్నాం, కానీ, మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పారు. అందువల్ల, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన ఫలితాలు, పోషకాహారం – ఇవన్నీ భారతదేశ అధ్యక్ష పదవికి చాలా కీలకమైనవని అమితాబ్ కాంత్ అన్నారు. 21వ శతాబ్దపు అవసరాల దృష్ట్యా బహుపాక్షిక సంస్థలపై కూడా దృష్టి సారించామని అమితాబ్ కాంత్ చెప్పారు.
“క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫైనాన్స్ నేపథ్యంలో గ్రీన్ డెవలప్మెంట్లో ప్రపంచం ముందుండాలని మేము కోరుకున్నాము. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి, అందువల్ల గ్రీన్ డెవలప్మెంట్, క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫైనాన్స్ మా మూడవ ప్రాధాన్యత. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, క్లైమేట్ యాక్షన్ రెండింటికీ ఫైనాన్స్ అవసరం, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల 21వ శతాబ్దపు బహుపాక్షిక సంస్థలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.” అని అమితాబ్ కాంత్ అన్నారు.ప్రధాని మోదీ చేసిన ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వ ప్రతిపాదన వంటి ప్రకటన లేదా ఫలితాల గురించి నాయకులు నిర్ణయించే వరకు తాను మాట్లాడలేనని భారతదేశానికి చెందిన షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు. దేశ రాజధానిలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది.
తాజావార్తలు
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?