Jagdeep Dhankhar: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు.. ఈడీ రైడ్స్పై హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar says baseless remarks to have results: ఈడీ రైడ్స్పై తగిన ఆధారాలు లేకుండా సభలో ఆరోపణలు చేయొద్దని, అలాంటి ఆరోపణలు సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానమని.. రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్కర్ హితవు పలికారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ధన్కర్ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. ‘‘సభలో ఎవరేం మాట్లాడినా, అది కచ్ఛితత్వంతో కూడినది అయ్యుండాలి. తగిన ఆధారాలతోనే మాట్లాడాలి. ఆధారాలు లేని గణాంకాల్ని సభలో చెప్తామంటే.. అనుమతించే ప్రసక్తే లేదు. ఇష్టానుసారంగా తోచింది మాట్లాడితే, సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానం అవుతుంది. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోము. సభలో ఏదైనా ఆరోపణ చేస్తే.. అందుకు చట్టబద్ధ డాక్యుమెంటేషన్ ఉండాలి’’ అంటూ ఆయన ఉద్ఘాటించారు.
Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
అంతకుముందు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని.. కానీ, కేవలం 23 మందిని మాత్రమే దోషులుగా తేల్చిందని అన్నారు. ‘‘ఈడీ కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఎందుకు సోదాలు నిర్వహిస్తోంది? 20 వేల కోట్ల మోసానికి పాల్పడ్డ నిరవ్ మోడీపై ఎందుకు మౌనం పాటిస్తోంది? నిరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, వ్యాపమ్ స్కామ్లోని నేరస్తులపై ఎందుకు ఈడీ, సీబీఐ చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీలో ఉన్న అవినీతి అధికారులపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆయన ఇల్లీగల్ మైనింగ్లో ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డి బ్రదర్స్తో పాటు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లను సైతం తెరమీదకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభాపతిని కలుగజేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు.
Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..