Jagdeep Dhankhar: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు.. ఈడీ రైడ్స్పై హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar says baseless remarks to have results: ఈడీ రైడ్స్పై తగిన ఆధారాలు లేకుండా సభలో ఆరోపణలు చేయొద్దని, అలాంటి ఆరోపణలు సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానమని.. రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్కర్ హితవు పలికారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ధన్కర్ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. ‘‘సభలో ఎవరేం మాట్లాడినా, అది కచ్ఛితత్వంతో కూడినది అయ్యుండాలి. తగిన ఆధారాలతోనే మాట్లాడాలి. ఆధారాలు లేని గణాంకాల్ని సభలో చెప్తామంటే.. అనుమతించే ప్రసక్తే లేదు. ఇష్టానుసారంగా తోచింది మాట్లాడితే, సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానం అవుతుంది. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోము. సభలో ఏదైనా ఆరోపణ చేస్తే.. అందుకు చట్టబద్ధ డాక్యుమెంటేషన్ ఉండాలి’’ అంటూ ఆయన ఉద్ఘాటించారు.
Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
అంతకుముందు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని.. కానీ, కేవలం 23 మందిని మాత్రమే దోషులుగా తేల్చిందని అన్నారు. ‘‘ఈడీ కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఎందుకు సోదాలు నిర్వహిస్తోంది? 20 వేల కోట్ల మోసానికి పాల్పడ్డ నిరవ్ మోడీపై ఎందుకు మౌనం పాటిస్తోంది? నిరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, వ్యాపమ్ స్కామ్లోని నేరస్తులపై ఎందుకు ఈడీ, సీబీఐ చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీలో ఉన్న అవినీతి అధికారులపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆయన ఇల్లీగల్ మైనింగ్లో ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డి బ్రదర్స్తో పాటు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లను సైతం తెరమీదకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభాపతిని కలుగజేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు.
Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!