Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం
- ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు కలకలం
- కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం అమెరికాలోని కొలరాడోలోని బోల్డర్ ప్రాంతంలో ఒక వ్యక్తి సీసా బాంబులు విసిరడంతో పలువురు గాయపడ్డారు. ఇలా యూదులకు వ్యతిరేకంగా పాలస్తీనా సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
తాజాగా ఈ వాతావరణం భారత్కు కూడా పాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి.. చాణక్యపురి ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయం సమీపంలో ఉన్న స్తంభాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు క్రిమినల్ వాంటెడ్గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశాడు. దీంతో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!
ఢిల్లీ పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోస్టర్లు అంటిస్తున్నట్లుగా కనిపెట్టారు. అతడు బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్లు గత వారమే అంటించగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ఈ ఘటనకు సంబంధించిన నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలను బెల్జియం పలు సందర్భాల్లో బహిరంగంగా ఖండించింది.
తాజావార్తలు
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!