Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం
- ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు కలకలం
- కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం అమెరికాలోని కొలరాడోలోని బోల్డర్ ప్రాంతంలో ఒక వ్యక్తి సీసా బాంబులు విసిరడంతో పలువురు గాయపడ్డారు. ఇలా యూదులకు వ్యతిరేకంగా పాలస్తీనా సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
తాజాగా ఈ వాతావరణం భారత్కు కూడా పాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి.. చాణక్యపురి ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయం సమీపంలో ఉన్న స్తంభాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు క్రిమినల్ వాంటెడ్గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశాడు. దీంతో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!
ఢిల్లీ పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోస్టర్లు అంటిస్తున్నట్లుగా కనిపెట్టారు. అతడు బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్లు గత వారమే అంటించగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ఈ ఘటనకు సంబంధించిన నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలను బెల్జియం పలు సందర్భాల్లో బహిరంగంగా ఖండించింది.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!