Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం
- ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు కలకలం
- కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం అమెరికాలోని కొలరాడోలోని బోల్డర్ ప్రాంతంలో ఒక వ్యక్తి సీసా బాంబులు విసిరడంతో పలువురు గాయపడ్డారు. ఇలా యూదులకు వ్యతిరేకంగా పాలస్తీనా సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
తాజాగా ఈ వాతావరణం భారత్కు కూడా పాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి.. చాణక్యపురి ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయం సమీపంలో ఉన్న స్తంభాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు క్రిమినల్ వాంటెడ్గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశాడు. దీంతో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!
ఢిల్లీ పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోస్టర్లు అంటిస్తున్నట్లుగా కనిపెట్టారు. అతడు బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్లు గత వారమే అంటించగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ఈ ఘటనకు సంబంధించిన నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలను బెల్జియం పలు సందర్భాల్లో బహిరంగంగా ఖండించింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!