IPS officer: విషాదం.. పోస్టింగ్కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..
- రోడ్డు ప్రమాదంలో యువ ఐపీఎస్ అధికారి మృతి..
- పోస్టింగ్ తీసుకునేందుకు వెళ్తున్న సమయంలో కార్ యాక్సిడెంట్..
- విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కర్ణాటక కేడర్కి చెందిన 2023 బ్యాచ్ అధికారి అయిన 26 ఏళ్ల హర్ష్ బర్ధన్ మరణించడం తీవ్ర విషాదానికి కారణమైంది.ఆయన మైసూర్ లోని కర్ణాటక పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు.
Read Also: Suman Kumar: హ్యాట్రిక్తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
హాసన్కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని కిట్టనే సమీపంలో సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బర్ధన్ ప్రయాణిస్తున్న కారు పగిలిపోవడంతో డ్రైవర్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్(డీఏఆర్) కానిస్టేబుల్ మంజేగౌడ అదుపుతప్పాడు. ఆ తర్వాత కార్ ఓ ఇంటిని, రోడ్డు పక్కన చెట్టుని ఢీకొట్టింది. బర్ధన్ తలకు బలమైన గాయాలు కావడంతో హసన్లోని జనప్రియ ఆస్పత్రికి తరలించారు. బెంగళూర్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించేటప్పటికీ, అప్పటికే చికిత్స పొందతూ మరనించాడు. డ్రైవర్ మంజేగౌడకు స్వల్పగాయాలై చికిత్స పొందుతున్నాడు.
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలోని దోసర్ గ్రామానికి చెందిన బర్ధన్, హోలెనరసిపూర్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టేందుకు హాసన్కు వెళ్తున్నాడు. అతడి కుటుంబం బీహార్లో ఉంది. అతడి తండ్రి అఖిలేష్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన బర్ధన్ ఆరు నెలల జిల్లా ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బర్ధన్ మృతిపై విచారం వ్యక్తి చేశారు. సంవత్సరాల కృషి ఫలిస్తున్ను సమయంలో ఇలా జరగాల్సింది కాదని అన్నారు. మాజీ సీఎం సదానంద గౌడ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావంతో కూడిన యువ అధికారిని కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.
ಹಾಸನ – ಮೈಸೂರು ಹೆದ್ದಾರಿಯ ಕಿತ್ತಾನೆ ಗಡಿ ಬಳಿ ಸಂಭವಿಸಿದ ಭೀಕರ ಅಪಘಾತದಲ್ಲಿ ಪ್ರೊಬೆಷನರಿ ಐಪಿಎಸ್ ಅಧಿಕಾರಿ ಹರ್ಷಬರ್ಧನ್ ಅವರು ನಿಧನರಾದ ವಿಷಯ ತಿಳಿದು ದುಃಖವಾಯಿತು.
ಐಪಿಎಸ್ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಅಧಿಕಾರ ಸ್ವೀಕರಿಸಲು ತೆರಳುತ್ತಿದ್ದ ವೇಳೆ ಇಂಥದ್ದೊಂದು ದುರ್ಘಟನೆ ಜರುಗಿದೆ ಎನ್ನುವುದು ಬಹಳಾ ಬೇಸರದ ಸಂಗತಿ. ವರ್ಷಗಳ ಕಠಿಣ ಪರಿಶ್ರಮ ಫಲ… pic.twitter.com/VwU86Irabi
— Siddaramaiah (@siddaramaiah) December 2, 2024
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!