Uddhav Thackeray: “బీజేపీ అవమానిస్తే మాతో చేరండి, మంత్రిని చేస్తాం”.. నితిన్ గడ్కరీకి ఠాక్రే పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని పుసాద్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొలిజాబితాలో ఉన్నారని, కానీ నితిన్ గడ్కరీ పేరు లేదని చెప్పారు.
‘‘ రెండు రోజుల క్రితమే గడ్కరీకి ఈ విషయం చెప్పాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురైతే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో చేరండి. మీ గెలుపు ఖాయం, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తాం.’’ అని ఠాక్రే అన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(యూబీటీ) ఉన్నాయి. బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు చర్చలు పూర్తి కానందున మొదటి జాబితాలో మహారాష్ట్ర నుంచి పేర్లు ప్రకటించలేదని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
Read Also: Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!
సీఏఏ చట్టాన్ని ఎన్నికల జుమ్లాగా ఠాక్రే అభివర్ణించారు. హిందువులు, సిక్కులు, పార్సీలు, ఇతరులు భారతదేశానికి వస్తున్నారు, అయితే త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని ఠాక్రే అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగేళ్లు దాటిందని, అయితే జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఎన్నికలు జరగలేదని, కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్లోని తమ ఇళ్లకు ఇంకా తిరిగి రాలేదని ఆయన బీజేపీని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ఆలోచనలో బీజేపీ ఉందని, మరోవైపు దేశభక్తుల కూటమైన ఇండియా కూటమి ఉందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు దేశభక్తులకు, ద్వేష భక్తులకు జరుగుతోందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మణిపూర్ పర్యటించేందుకు ప్రధాని మోడీకి ఇంకా సమయం దొరకలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?