Uddhav Thackeray: “బీజేపీ అవమానిస్తే మాతో చేరండి, మంత్రిని చేస్తాం”.. నితిన్ గడ్కరీకి ఠాక్రే పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని పుసాద్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొలిజాబితాలో ఉన్నారని, కానీ నితిన్ గడ్కరీ పేరు లేదని చెప్పారు.
‘‘ రెండు రోజుల క్రితమే గడ్కరీకి ఈ విషయం చెప్పాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురైతే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో చేరండి. మీ గెలుపు ఖాయం, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తాం.’’ అని ఠాక్రే అన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(యూబీటీ) ఉన్నాయి. బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు చర్చలు పూర్తి కానందున మొదటి జాబితాలో మహారాష్ట్ర నుంచి పేర్లు ప్రకటించలేదని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!
సీఏఏ చట్టాన్ని ఎన్నికల జుమ్లాగా ఠాక్రే అభివర్ణించారు. హిందువులు, సిక్కులు, పార్సీలు, ఇతరులు భారతదేశానికి వస్తున్నారు, అయితే త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని ఠాక్రే అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగేళ్లు దాటిందని, అయితే జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఎన్నికలు జరగలేదని, కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్లోని తమ ఇళ్లకు ఇంకా తిరిగి రాలేదని ఆయన బీజేపీని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ఆలోచనలో బీజేపీ ఉందని, మరోవైపు దేశభక్తుల కూటమైన ఇండియా కూటమి ఉందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు దేశభక్తులకు, ద్వేష భక్తులకు జరుగుతోందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మణిపూర్ పర్యటించేందుకు ప్రధాని మోడీకి ఇంకా సమయం దొరకలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!