Minister Satya Kumar Yadav: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం.. ఆరోగ్యశ్రీకి రూ.2,500 కోట్ల బకాయిలు..!
- ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం..
- పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు..
- కళాశాల నిర్మాణం కాకుండా ఎలా ప్రారంభించాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆరోపించారు . దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు. మేం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే.. మీరు ఐదేళ్లు పులివెందులలో ఆసుపత్రి కట్టారు, కళాశాలలు కట్టలేదని విమర్శించారు. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా విద్యా ప్రమాణాలను ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కందుల దుర్గేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వైద్య కళాశాల నిర్మాణంలో ఉందని, ఎన్ఎంసీకి నివేదికలు ఇచ్చారని తెలిపారు.
Read Also: D. Sridhar Babu: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రచారం చేస్తున్నారు..
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
వైద్యవిద్య అందించాలంటే ప్రమాణాలుంటాయని, వాటిని పాటించకుండా చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టేనని వ్యాఖ్యానించారు సత్యకుమార్ యాదవ్.. వైద్య విద్యకోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దీనిపై అవగాహన చేసుకోండని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 కళాశాలలో రాబోయే ఏడాదికి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక, మద్యంపై 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పుపెట్టివెళ్లిందని గుర్తు చేశారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మీద ముందుగానే అప్పు చేసిన ఘనత జగన్ దేనని ఆరోపించారు. 13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 2500 కోట్లు బకాయిలు పెట్టింది వెళ్లిందని, 652 కోట్లు మేం బకాయిలు చెల్లించామని వివరించారు. అధికారంలోకి వచ్చిన ౩ నెలలోనే వేలాది కోట్లు బకాయిలు చెల్లించడం భారమే, కానీ, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు. సదరన్ సర్టిఫికేట్ల అంశంలో సర్వే జరుగుతుందని, తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినవారి పెన్షన్లు తొలగిస్తామని.. ఎవరైన ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తేలితే వైద్యులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి సత్యకుమార్.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?