Monsoon:దెబ్బతీసిన ఎల్ నినో.. 5 ఏళ్ల కనిష్ట స్థాయికి వర్షాలు.. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: అనుకున్నట్లుగానే ఎల్ నినో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 3 ట్రిలియన్ డాలర్ల ఉన్న ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవగా నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో వ్యవసాయానికి రుతుపవనాలే చాలా కీలకం.
ఇదిలా ఉంటే ఒకవేళ వేసవి వర్షాలు కూడా తగ్గితే దేశంలో ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటి ఉత్పత్తి తగ్గితే మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఏర్పడితే బియ్యం, చక్కెర, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ వాటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారు
రుతుపవనాల కొరత ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక జూన్-సెప్టెంబర్ కాలంలో సగటు వర్షపాతంలో 94 శాతమే వర్షపాతం నమోదైంది. రుతపవనాల ప్రారంభానికి ముందు ఎల్ నినో ప్రభావాన్ని ఉహించి 4 శాతం లోటు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
సాధారణంగా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినోగా చెబుతారు. దీని వల్ల భారత ఉపఖండంతో వర్షాలు తగ్గి, పొడి పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ ఏడాది జూన్ నెలలో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ఆ నెలలో 9 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. జూలై నెలలో సగటు కన్నా 13 శాతం వర్షాలు అధికంగా కురిశాయి. ఆగస్టులో 36 శాతం లోటు ఏర్పడింది. మళ్లీ సెప్టెంబర్ నెలలో 13 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర బియ్యం ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకం విధించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో వర్షపాతం తగ్గడంతో చక్కెర పంట ఉత్పాదకత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో చక్కెర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
- Tags
- agriculture
- El-Nino
- india
- Monsoon
తాజావార్తలు
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!