Cancer: క్యాన్సర్ కణాలను చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు.
గోల్డ్, కాపర్ సల్పైడ్ తో కూడిన హైడ్రో నానోపార్టికల్స్ని రూపొందించి, ఇవి వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని, ధ్వని తరంగాలను ఉపయోగించి వాటిని గుర్తించగలవని సైంటిస్టులు చెబుతున్నారు. ACS అప్లైడ్ నానో మెటీరియల్స్లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ఈ కొత్త విధానం గురించి వివరించింది.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Read Also: Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని
ఈ హైబ్రీడ్ నానోపార్టికల్స్ ఫోటో థర్మర్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి ఫోటో కాస్టిక్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. కాంతికి గురైనప్పుడు ఈ పార్టికల్స్ దాన్ని గ్రహించి ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. దీతో క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా చంపేయవచ్చు. ఇంతే కాకుండా విషపూరిత సింగిల్ట్ ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేసి క్యాన్సర్ కణాల నాశనానికి మరింతగా ఉపయోగపడుతాయి. ఇదిలా ఉంటే ఈ నానోపార్టికల్స్ కాంతిని గ్రహించి ఆల్ట్రాసౌండ్ వేవ్స్ ని ఉత్పత్తి చేయగలవు. దీంతో రోగనిర్థారణ చేయవచ్చు. క్యాన్సర్ కణాలను గుర్తించగలదు.
కణజాలాల గుండా వెళ్తున్నప్పుడు ధ్వని తరంగాలు కాంతి కంటే తక్కువగా వెదజల్లుతాయి. స్పష్టమైన చిత్రాలను, క్యాన్సర్ కణితుల్లోని ఆక్సిజన్ సాచురేషన్ ఖచ్చితమైన మెజర్మెంట్స్ ని అందించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించడం ద్వారా, కాపర్ సల్పైడ్ ఉపరితలంపై చిన్నచిన్న గోల్డ్ సీడ్స్ ని జమచేయగలిగారు. 8 nm కంటే తక్కువ పరిమాణంలో హైబ్రిడ్ నానోపార్టికల్స్ను సృష్టించారు. ఈ సూక్ష్మ పార్టికల్స్ కణజాలాలు నుేంచి సులభంగా కణితులను చేరుకోగలవు. అదే సమయంలో మానవ శరీరంలో పేరుకుపోకుండా, బయటకు వెళ్లేంత చిన్నవిగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ నానోపార్టికల్స్ ని ప్రయోగశాలలో ఉపిరితిత్తులు, గర్భాశయ క్యాన్సర్ కణ తంతువులపై పరీక్షించబడ్డాయి. ముందుముందు మరిన్ని ఆశాజనక ఫలితాాలు వస్తాయని ఐఐఎస్సీ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!