Cancer: క్యాన్సర్ కణాలను చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు.
గోల్డ్, కాపర్ సల్పైడ్ తో కూడిన హైడ్రో నానోపార్టికల్స్ని రూపొందించి, ఇవి వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని, ధ్వని తరంగాలను ఉపయోగించి వాటిని గుర్తించగలవని సైంటిస్టులు చెబుతున్నారు. ACS అప్లైడ్ నానో మెటీరియల్స్లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ఈ కొత్త విధానం గురించి వివరించింది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని
ఈ హైబ్రీడ్ నానోపార్టికల్స్ ఫోటో థర్మర్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి ఫోటో కాస్టిక్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. కాంతికి గురైనప్పుడు ఈ పార్టికల్స్ దాన్ని గ్రహించి ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. దీతో క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా చంపేయవచ్చు. ఇంతే కాకుండా విషపూరిత సింగిల్ట్ ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేసి క్యాన్సర్ కణాల నాశనానికి మరింతగా ఉపయోగపడుతాయి. ఇదిలా ఉంటే ఈ నానోపార్టికల్స్ కాంతిని గ్రహించి ఆల్ట్రాసౌండ్ వేవ్స్ ని ఉత్పత్తి చేయగలవు. దీంతో రోగనిర్థారణ చేయవచ్చు. క్యాన్సర్ కణాలను గుర్తించగలదు.
కణజాలాల గుండా వెళ్తున్నప్పుడు ధ్వని తరంగాలు కాంతి కంటే తక్కువగా వెదజల్లుతాయి. స్పష్టమైన చిత్రాలను, క్యాన్సర్ కణితుల్లోని ఆక్సిజన్ సాచురేషన్ ఖచ్చితమైన మెజర్మెంట్స్ ని అందించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించడం ద్వారా, కాపర్ సల్పైడ్ ఉపరితలంపై చిన్నచిన్న గోల్డ్ సీడ్స్ ని జమచేయగలిగారు. 8 nm కంటే తక్కువ పరిమాణంలో హైబ్రిడ్ నానోపార్టికల్స్ను సృష్టించారు. ఈ సూక్ష్మ పార్టికల్స్ కణజాలాలు నుేంచి సులభంగా కణితులను చేరుకోగలవు. అదే సమయంలో మానవ శరీరంలో పేరుకుపోకుండా, బయటకు వెళ్లేంత చిన్నవిగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ నానోపార్టికల్స్ ని ప్రయోగశాలలో ఉపిరితిత్తులు, గర్భాశయ క్యాన్సర్ కణ తంతువులపై పరీక్షించబడ్డాయి. ముందుముందు మరిన్ని ఆశాజనక ఫలితాాలు వస్తాయని ఐఐఎస్సీ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!