Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బుక్ అయిన టికెట్ తేదీలను కూడా మార్చుకోవచ్చు..
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- ఇకపై బుక్ అయిన టికెట్ల ప్రయాణ తేదీని కూడా మార్చుకోచ్చు..
- జనవరి నుంచి కొత్త వ్యవస్థ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways: మీరు ప్రయాణం కోసం రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, హఠాత్తుగా వెళ్లాల్సిన కార్యక్రమం తేదీ మారింది. అలాంటి సమయంలో జర్నీ డేట్ మార్చడానికి గతంలో వీలు కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా, బుక్ చేసుకున్న టికెట్ల ప్రయాణ తేదీలను మార్చడానికి భారతీయ రైల్వే అనుమతినిచ్చింది. ప్రస్తుతం, ప్రయాణికుడు తన ప్రయాణ తేదీని మార్చడానికి వారికి బుక్ అయిన టికెట్ను రద్దు చేసుకుని, కొత్తదాన్ని బుక్ చేసుకుంటున్నారు. జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి రాబోతోన్న కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికుడి ఇబ్బందులు తీరనున్నాయి.
జనవరి నుంచి, ప్రయాణికులు తమకు కన్ఫామ్ అయిన రైలు టికెట్ ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్లో మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, ప్రయాణికులు ప్రయాణ తేదీని మార్చుకునే వీలు లేదు. తనకు బుక్ అయిన టికెట్ను రద్దు చేసుకుని, కొత్తదానిని బుక్ చేసుకోవాలి. వారి ప్రయాణ తేదీ టైమ్ ఆధారంగా రీఫండ్ వస్తుంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా కనిపిస్తుంది.
Also Read
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
Read Also: University : దేవతల పసుపు బొమ్మలతో సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో
‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అన్యాయమైంది. ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ’’ అని అశ్విని వైష్ణవ్ అన్నారు. కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తనకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాల్సిందే.
ప్రస్తుత నిబంధన ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు బుకింగ్ టికెట్ను రద్దు చేసుకుంటే ఛార్జీల నుంచి 25 తగ్గించి, మిగిలిన డబ్బు రీఫండ్ చేస్తారు. 12 గంటల నుంచి 4 గంటల ముందు ఛార్జ్ మరింత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బు తిరిగి చెల్లించబడదు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!