Indian Railways: రైల్వే ప్రయాణికులకు ఉచితంగా భోజనం.. షరతులు వర్తిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందిస్తామని వెల్లడించింది. అయితే సదరు రైళ్లు రెండు గంటల కంటే మించి ఆలస్యం అయితేనే ఫ్రీ మీల్స్ ఇస్తామని స్పష్టం చేసింది. రైలు ఆలస్యానికి కారణం ఏదైనా ఉచితంగా భోజనం అందిస్తామని భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రీమియం రైళ్లు ప్రయాణికులను సమయానికి గమ్యస్థానం చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇతర కారణాల వల్ల ఆలస్యం జరిగితే ఆ నష్టాన్ని రైల్వేశాఖ భరించాల్సి ఉంటుంది. అందుకే సదరు రైళ్లు రెండు గంటలు కంటే ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైలు సమయాన్ని బట్టి ప్రయాణికులు బ్రేక్ ఫాస్ట్ లేదా మీల్స్ లేదా స్నాక్స్ లేదా డిన్నర్ను ఎంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆహారం అందించే బాధ్యతను ఐఆర్సీటీసీ నిర్వర్తిస్తుంది.
Read Also: కృష్ణంరాజు ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Also Read
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
1999లో ఐఆర్సీటీసీ అందుబాటులోకి రాగా అప్పటి నుంచి ఈ సంస్థే రైళ్లలో భోజనాలకు సంబంధించిన సదుపాయాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కిచెన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన నాణ్యతతో భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మీల్స్ ఇచ్చే ట్రేలను బయోడీగ్రేడబుల్ మెటీరియల్తో తయారుచేయిస్తోంది. ఎయిర్టైట్ కవర్లలో ఆహారాన్ని సర్వ్ చేస్తోంది. ఇప్పటికే పలు స్టేషన్లలో రైల్వే ఫ్లాట్ఫారాలపై ఫుడ్ కోర్టులు, ఫుడ్ ప్లాజాలు, ఫుడ్ యూనిట్లను ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. దీని కోసం నిబంధనల ప్రకారం షాపుల నిర్వాహకులకు ఐఆర్సీటీసీ కాంట్రాక్టులను కేటాయిస్తోంది. కాగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భారతీయ రైల్వేల ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాది రూ.26,721 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.95,486 కోట్లకు చేరింది.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!