Syria Crisis: సిరియా సంక్షోభంపై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..!
- సిరియాలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై స్పందించిన భారత్ ..
- ప్రస్తుతం సిరియాలో నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నాం..
- సిరియాలోని భారతీయుల భద్రత కోసం డమాస్కస్లోని మన ఎంబసీ తెరిచే ఉంది: EAM
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syria Crisis: సిరియాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. తిరుగుబాటుదారులు రెచ్చిపోవడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ రష్యాకు పారిపోయాడు. దీంతో ఆయన సర్కార్ కూలిపోయి.. సిరియా పూర్తిగా రెబల్స్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాలపై తాజాగా భారత విదేశాంగశాఖ రియాక్ట్ అయింది. ఆ దేశంలో మళ్లీ స్థిరత్వం రావాలని కోరుకుంది.
Read Also: R. Krishnaiah: మరోసారి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
ఇక, సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సిరియా ప్రజల అభీష్టం మేరకు శాంతిస్థాపన జరిగేలా సమ్మిళిత రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పుకొచ్చింది. సిరియాలో ఉన్న భారతీయుల భద్రత కోసం డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీ నిరంతరం పని చేస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Read Also: Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. కంపెనీ సంచలన నిర్ణయం
కాగా, సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడి ఇండియన్స్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వారందరూ సురక్షితంగా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయాన్ని అన్ని వేళలా తెరిచే ఉంచినట్లు వెల్లడించింది.
Read Also: Chinmoy Krishnadas: బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు
ఇక, రెబల్స్ ఆక్రమణతో అధ్యక్షుడు అసద్ తన ఫ్యామిలితో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం మాస్కోలోనే ఉన్నారు ఆయన. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా నుంచి వెళ్లిపోయారని రష్యా సర్కార్ పేర్కొనింది. ఇక, అసద్ పారిపోయిన తర్వాత అధ్యక్ష భవనంలోకి ప్రజలు దూసుకుపోయారు. అక్కడి ఫర్నిచర్, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిరియా అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేటు గ్యారేజీలో కోట్ల రూపాయల విలువైన పోర్ష్, లంబోర్గిని, ఫెరారీ లాంటి కార్లు ఉన్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..