S Jaishankar: చైనా, పాకిస్తాన్కు జైశంకర్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India won’t be coerced by anybody, Jaishankar’s message to Pakistan, China: భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మే 2020లో చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)పై యథాతథ స్థితిని ఏకపక్షంగా మర్చడానికి ప్రయత్నించిందని దీనికి భారత్ ధీటుగా, ధృడమైన సందేశాన్ని పంపిందని జైశంకర్ శనివారం అన్నారు. తుగ్లక్ పత్రిక 53వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద కూడా చైనా ఇలాంటి దురాక్రమణకే ప్రయత్నించిందని అన్నారు. సరిహద్దు వెంబడి భారతబలగాలు అత్యంత తీవ్రమైన కఠిన పరిస్థితుల్లో సరిహద్దును కాపాడుతున్నారని ఆయన అన్నారు.
Read Also: Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడి.. 12 మంది మృతి
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
భారతదేశాన్ని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయలేరని.. జాతీయ భద్రత కోసం భారత్ ఏమి చేయాలో అది చేస్తుందని, ప్రపంచం కూడా భారత్ ను ఇలానే చూస్తోందని, చైనాను ఎదురించిన తీరును ప్రపంచం మొత్తం చూసిందని ఆయన అన్నారు. ఎల్ఏసీ పశ్చిమాన ఉన్న గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ మధ్య చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందిందని జైశంకర్ ప్రశంసించారు. ఇది ప్రపంచవేదికపై భారత్ స్థాయిని పెంచిందని అన్నారు. ప్రపంచ ఎజెండాను రూపొందించే ప్రక్రియలో దాన్ని ప్రభావితం చేసే దేశంగా భారత్ మారిందని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ధృడంగా వ్యవహరిస్తోందని.. అందుకు ఉరీ, బాలాకోట్ దాడులే ఉదాహరణ అని అన్నారు. భారత్ తన కోసం, ప్రపంచం కోసం వ్యాక్సిన్ తయారు చేసిందని అన్నారు. ప్రపంచంలో 100 కన్నా ఎక్కువ దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసిందని తెలిపారు. 1947లో దేశ విభజన జరగకపోతే ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారత్ ఉండేదని.. చైనా కాదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!