Pahalgam Terror Attack: పాక్కు భారత్ మరో షాక్.. పూర్తిగా వాణిజ్యం రద్దు
- పాక్కు భారత్ మరో షాక్
- పూర్తిగా వాణిజ్యం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. తాజాగా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసింది. ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దొడ్డిదారిన పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పరోక్ష దిగుమతులను కూడా బ్యాన్ చేసింది. పాక్ను దారికి తెచ్చేందుకు భారత్ ఒక్కొక్కటిగా కఠిన చర్యలు చేపడుతోంది. తాజా నిర్ణయంతో పాక్కు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: మే 5న అంబర్పేట్ ప్లై ఓవర్ను గడ్కరీ ప్రారంభిస్తారు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
పాకిస్థాన్ నుంచి వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని.. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పింది. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరంతా పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఇక ఉగ్రవాదులు ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో ఉన్నట్లుగా అధికారాలు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. !
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..