Hypersonic missile: హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్
- హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్
- ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఈ ప్రయోగం చేపట్టిన డీఆర్డీఓ..
- హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయం సాధించడం ఒక చారిత్రాత్మక ఘట్టం: రాజ్నాథ్ సింగ్
Hypersonic missile: భారతదేశం తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఈరోజు (ఆదివారం) ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే, 1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుందన్నారు. వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా ఈ క్షిపణిని డిజైన్ చేశారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని క్రాస్ చేసింది. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లైందని ఎక్స్ వేదికగా రక్షణ శాఖ పోస్టు చేసింది.
Read Also: Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్
Also Read
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
అయితే, ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా మానిటరింగ్ చేశారు. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వెల్లడించింది. హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్లో ఈ హైపర్ సోనిక్ క్షిపణినీ రూపొందించారు. దేశంలోని ఇతర డీఆర్డీవో ల్యాబ్లు, పరిశ్రమలు దీనికి హెల్ప్ చేశాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది.
India has achieved a major milestone by successfully conducting flight trial of long range hypersonic missile from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is a historic moment and this significant achievement has put our country in the group of select nations… pic.twitter.com/jZzdTwIF6w
— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024
తాజావార్తలు
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!