Hypersonic missile: హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్
- హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్
- ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఈ ప్రయోగం చేపట్టిన డీఆర్డీఓ..
- హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయం సాధించడం ఒక చారిత్రాత్మక ఘట్టం: రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hypersonic missile: భారతదేశం తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఈరోజు (ఆదివారం) ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే, 1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుందన్నారు. వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా ఈ క్షిపణిని డిజైన్ చేశారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని క్రాస్ చేసింది. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లైందని ఎక్స్ వేదికగా రక్షణ శాఖ పోస్టు చేసింది.
Read Also: Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్
Also Read
- Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
అయితే, ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా మానిటరింగ్ చేశారు. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వెల్లడించింది. హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్లో ఈ హైపర్ సోనిక్ క్షిపణినీ రూపొందించారు. దేశంలోని ఇతర డీఆర్డీవో ల్యాబ్లు, పరిశ్రమలు దీనికి హెల్ప్ చేశాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది.
India has achieved a major milestone by successfully conducting flight trial of long range hypersonic missile from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is a historic moment and this significant achievement has put our country in the group of select nations… pic.twitter.com/jZzdTwIF6w
— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
OTR: గద్వాలలో ప్రోటోకాల్ వార్.. ఎమ్మెల్యే vs కార్పొరేషన్ చైర్పర్సన్!
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?