Pakistan-Bangladesh: బంగ్లాదేశ్కి పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు.. నిశితంగా గమనిస్తున్న భారత్..
- బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు..
- ఆ దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటన..
- పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న భారత్..
- బంగ్లా-పాక్ మధ్య పెరుగుతున్న స్నేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: షేక్ హసీనా దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహం బలోపేతం అవుతోంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారం బలపడుతోంది. ఇటీవల కాలంలో పలువురు బంగ్లాదేశ్కి చెందిన పలువురు సైనికాధికారులు పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ఇదే విధంగా పాకిస్తాన్ సైన్యం కూడా ఫిబ్రవరి నుంచి బంగ్లా సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వబోతోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను పెంచి పోషిస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చెందిన అధికారులు బంగ్లాదేశ్ వెళ్లారు. ఈ పరిణామాలు భారత్కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలను భారత్ నిషితంగా గమనిస్తోంది. జాతీయ భద్రతకు భంగం వాటిల్లితే తగిన చర్యలు తీసుకుంటామని భారత్ శుక్రవారం తెలిపింది. మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ నేతృత్వంలోని ఐఎస్ఐ ఉన్నత స్థాయి బృందం బంగ్లాదేశ్లో 4 రోజుల పర్యటనను శుక్రవారం ముగించిన తర్వాత భారత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: L2E Empuraan Teaser : లూసిఫర్ సీక్వెల్ “ఎంపురాన్”.. ఓ రేంజ్ లో హైప్ పెంచేసిన గ్లింప్స్
ఈ ఐఎస్ఐ బృందం చిట్టగాంగ్, రంగ్పూర్ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. చిట్టగాంగ్ ప్రాంతం మన త్రిపురతో సరిహద్దును పంచుకుంటోంది. ఇక రంగ్పూర్కి సమీపంలోనే భారత వ్యూహాత్మక కారిడార్, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ‘‘చికెన్స్ నెక్’’ లేదా సిలిగురి కారిడార్ ఉంది. ఈ ప్రాంతాల్లో ఐఎస్ఐ పర్యటించినట్లు తెలుస్తోంది. భారత్కి వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు పాక్-బంగ్లా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్లో ప్రో-పాకిస్తాన్ శక్తులైన జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు బలపడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లోనే అధికారం ఉంది. ఇవి భారత వ్యతిరేక వైఖరిని అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెరవెనక ఐఎస్ఐ-జమాత్ కార్యక్రమాలు పెరగడం భారత్కి ఆందోళన కలిగించే విషయం.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!