US Report: “R&AW, RSSలపై ఆంక్షలు పెట్టాలి”.. యూఎస్ రిపోర్ట్పై భారత్ ఘాటు స్పందన..
- ‘‘రా’’, ఆర్ఎస్ఎస్’’ లపై ఆంక్షలు విధించాలి..
- యూఎస్ రిపోర్ట్పై భారత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: అమెరికాలోని ‘‘యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్(USCIRF)’’ రిపోర్ట్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘన పేరుతో భారత్ను ‘‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం(కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్CPC)’’ జాబితాలో చేర్చాలని, అలాగే భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్(R&AW), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్ సూచించింది. అయితే, ఈ నివేదికపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదికను పూర్తిగా పక్షపాతంతో తయారైనదిగా అభివర్ణించారు.
Read Also: Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..
Also Read
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
USCIRF చాలా సంవత్సరాలుగా భారత్పై చాలా ఏళ్లుగా విషం కక్కుతోందని, ఎంపిక చేసిన సమాచారాన్ని మాత్రమే ప్రదర్శిస్తోందని, ఇది వాస్తవాల కన్నా ఐడియాలజీ ఆధారిత కథనాలపై ఆధారపడుతోందని ఆయన అన్నారు. ఈ తరహా నివేదికలు కమిషన్ విశ్వసనీయతకే నష్టం చేస్తాయని భారత్ పేర్కొంది. భారత్ను విమర్శించడం కన్నా అమెరికాలో హిందూ దేశాలయాలపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.
USCIRF తన 2026 వార్షిక నివేదికలో (2025 పరిస్థితుల ఆధారంగా) భారత్లో మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించింది. మైనారిటీ మతాలపై ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. అదే విధంగా అమెరికా ప్రభుత్వం రా, ఆర్ఎస్ఎస్లపై లక్ష్యిత ఆంక్షలు విధించాలని సూచించింది. వాటి ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడం, అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించడం వంటి చేయాలని సూచించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ‘‘మతమార్పిడి ’’ చట్టాలను కఠినతరం చేస్తున్నాయని చెప్పింది. దీంతో మైనారిటీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!