Covid 19: దేశంలో భారీగా కరోనా కేసులు.. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases In India: దేశంలో నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ చివరి నాటితో పోలిస్తే ఇప్పుడే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 163 రోజులలో ఈ రోజే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు నమోదయ్యాయి.
Read Also: Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
తాజా కేసులతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 4.47 కోట్లకు (4,47,33,719) చేరాయి. గడిచిన 24 గంటల్లో 15 మరణాలు సంభవించాయి. వీటితో ఇప్పటి వరకు 5,30,916 మరణించారు. తాజాగా సంభవించిన మరణాల్లో మహరాష్ట్ర, కేరళ నుంచి నలుగురి చొప్పున మరణించారు. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, పుదుచ్చేరి మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మరణించారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091 కు చేరింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.05 శాతంగా ఉంది. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు అయింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ సానుకూలత రేటు 2.79 శాతంగా నమోదు అయింది. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,79,712 చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?