India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్తో రక్షణ ఒప్పందంపై భారత్..
- సౌదీ అరేబియా-పాకిస్తాన్ ఒప్పందంపై స్పందించిన భారత్..
- సౌదీ, భారత్తో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.
Read Also: Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ..
Also Read
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
‘‘ భారత్, సౌదీ అరేబియాల మధ్య విస్తృత శ్రేణి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇది గత కొన్ని ఏళ్లుగా పెరిగింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలను, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు. అంతకుముందు గురువారం, భారత్ ఈ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. భారత జాతీయ ప్రయోజనాలను, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా తన రక్షణ కోసం పాకిస్తాన్ అణ్వాయుధాలను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది భారత్ను ఆందోళన పరిచే అంశంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సౌదీ ప్రభుత్వంతో ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. దోహాలో 40 ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖతార్పై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ ఒప్పందం భారత జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది మోడీ ప్రభుత్వ దౌత్య వైఫల్యంగా విమర్శిస్తోంది.
తాజావార్తలు
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!