India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్తో రక్షణ ఒప్పందంపై భారత్..
- సౌదీ అరేబియా-పాకిస్తాన్ ఒప్పందంపై స్పందించిన భారత్..
- సౌదీ, భారత్తో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.
Read Also: Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
‘‘ భారత్, సౌదీ అరేబియాల మధ్య విస్తృత శ్రేణి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇది గత కొన్ని ఏళ్లుగా పెరిగింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలను, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో అన్నారు. అంతకుముందు గురువారం, భారత్ ఈ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. భారత జాతీయ ప్రయోజనాలను, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా తన రక్షణ కోసం పాకిస్తాన్ అణ్వాయుధాలను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది భారత్ను ఆందోళన పరిచే అంశంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సౌదీ ప్రభుత్వంతో ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. దోహాలో 40 ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖతార్పై ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ ఒప్పందం భారత జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది మోడీ ప్రభుత్వ దౌత్య వైఫల్యంగా విమర్శిస్తోంది.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!