Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- హైదరాబాదీలకు గుడ్న్యూస్
- బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- తగ్గనున్న ప్రయాణ సమయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంగా దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్లు కూడా భారత్లో పరిగెత్తబోతున్నాయి. ఇందుకు సంబంధించిన కారిడార్లను కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. 7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించింది.

Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ‘బీ35 (B35)’ పేరుతో అత్యాధునిక హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నిర్ణయించింది. ఈ రైళ్ల రూపకల్పన, తయారీ కోసం సంస్థలు ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. భారత్లోనే తయారు కానున్న ఈ B35 బుల్లెట్ ట్రైన్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు. సాధారణ సేవల్లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని కొత్త బుల్లెట్ ట్రైన్ మార్గాల్లో ఇవే ప్రధాన హైస్పీడ్ రైళ్లుగా మారనున్నాయి.
7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
NHSRCL ప్రతిపాదనల ప్రకారం B35 రైళ్లు ఈ క్రింది హైస్పీడ్ మార్గాల్లో నడిచే అవకాశం ఉంది.
ముంబై – పుణె
పుణె – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
చెన్నై – బెంగళూరు
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ముంబై – అహ్మదాబాద్: 1 గంట 57 నిమిషాలు
ముంబై – పుణె: 48 నిమిషాలు
బెంగళూరు – చెన్నై: 73 నిమిషాలు
బెంగళూరు – హైదరాబాద్: 2 గంటల 10 నిమిషాలు
పుణె – హైదరాబాద్: 2 గంటల 8 నిమిషాలు
ఢిల్లీ – లక్నో: 2 గంటలు
ఢిల్లీ – వారణాసి: 3 గంటల 15 నిమిషాలు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా
ఇక దేశంలోని తొలి 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లోని సూరత్-వాపి మధ్య 97 కిలోమీటర్ల విభాగంలో 2027 ఆగస్టు నాటికి బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించాలని NHSRCL లక్ష్యంగా పెట్టుకుంది. B35 బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధితో భారత్లోనే అత్యాధునిక హైస్పీడ్ రైళ్ల తయారీకి ఊతం లభించనుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో వేగవంతమైన, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన రైలు సేవలు అందుబాటులోకి రావడంతో రవాణా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

తాజావార్తలు
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!