Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు
- ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్నినో ప్రభావమో.. లేదంటే ఇంకేంటో తెలియదు గానీ.. జూన్ నెల వర్షాలు లేకుండానే ముగిసిపోయింది. దేశంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైనా.. ఏ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురవలేదు. ఆశ్చర్యం ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. ఇప్పటికీ దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వార్నింగ్ ఇచ్చినట్లుగానే వరుణుడు ముఖం చాటేశాడు. 1901 తర్వాత ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్ సృష్టించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలేటట్టు కనిపిస్తున్నాయి.

Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆలస్య ప్రవేశం దేశవ్యాప్తంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1901 నుంచి వాతావరణ రికార్డులు నమోదు చేస్తున్న చరిత్రలో 2026 జూన్ నెల ఐదో అత్యంత పొడి జూన్గా నమోదైంది. సాధారణ సగటుతో పోలిస్తే జూన్ నెలలో 39.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.
దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం
గత పదేళ్లలో ఇదే అత్యంత తక్కువ జూన్ వర్షపాతంగా నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా 165.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. అయితే ఈసారి కేవలం 99.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీతో పోలిస్తే మూడు రోజుల ఆలస్యంగా కేరళలో ప్రవేశించాయి. అనంతరం పశ్చిమ భారతదేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాల వైపు రుతుపవనాల పురోగతి దాదాపు రెండు వారాల పాటు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా తగ్గింది. ఇక వర్షాభావం కారణంగా ఖరీఫ్ పంటల సాగు పనులు మందగించాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటల విత్తనాల విత్తకం ఆలస్యమవుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండుతున్న ఎండలు
ఇక వర్షాల లేమితో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. ఈ వర్షాలు దేశంలోని చెరువులు, జలాశయాలు, భూగర్భ జలాలను నింపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సుమారు 4 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండగా.. దేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం లేదు. అలాగే దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో రుతుపవనాల ఆలస్యం రైతులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!