India-China: లడఖ్లో ఏర్పాటు చేసిన చైనా కౌంటీలపై భారత్ అభ్యంతరం
- లడఖ్లో ఏర్పాటు చేసిన చైనా కౌంటీలపై భారత్ అభ్యంతరం
- దౌత్య మార్గాల ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా-భారత్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతున్న తరుణంలో మరోసారి డ్రాగన్ దేశం హద్దులు దాటింది. లడఖ్ సరిహద్దులో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా ఆక్రమణలను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. చట్ట విరుద్ధ, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల వాటికి చట్టబద్ధత కల్పించినట్లు కాదని తెలిపింది. ఇదే అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ శుక్రవారం వెల్లడించారు.
ఇది కూడా చదవండి: NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
డిసెంబర్ 27న చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. హోటాన్ ప్రిఫెక్చర్ ద్వారా నిర్వహించబడుతున్న కౌంటీల స్థాపనను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, స్టేట్ కౌన్సిల్ సెంట్రల్ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. అయితే ఈ ప్రాంతాలు భారతదేశంలోని కేంద్ర పాలిక ప్రాంతమైన లడఖ్ పరిధిలోకి వస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలోని భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో భారత్కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై చైనా ఆక్రమణకు అవకాశం ఇవ్వబోదని తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా చైనాకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై సర్కార్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..